AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిత్తూరు : 5 ఏళ్ల చిన్నారి ‘హత్యాచారం’ కేసులో… దోషిపై కనికరం చూపిన హైకోర్టు

గతేడాది చిత్తూరు జిల్లా చేనేత నగర్ లో 5 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి.. దారుణంగా హత్య చేసిన ఉదంతం రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌క‌పంన‌లు రేపిన విష‌యం తెలిసిందే.

చిత్తూరు : 5 ఏళ్ల చిన్నారి ‘హత్యాచారం’ కేసులో... దోషిపై కనికరం చూపిన హైకోర్టు
Ram Naramaneni
|

Updated on: Jul 17, 2020 | 9:24 AM

Share

గతేడాది చిత్తూరు జిల్లా చేనేత నగర్ లో 5 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి.. దారుణంగా హత్య చేసిన ఉదంతం రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌క‌పంన‌లు రేపిన విష‌యం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఫోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడైన‌ లారీ క్లీనర్ మహ్మద్ రఫీని అదుపులోకి తీసుకున్నారు. ‌ఆపై కేసును విచారించి 110 రోజుల్లోనే నిందితుడుని దోషిగా తేల్చుతూ.. మరణశిక్ష విధించింది ఫోక్సో న్యాయస్థానం. ఫోక్సో కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశాడు నిందితుడు రఫీ.

కేసును విచారించిన జస్టిస్ సి.ప్రవిణ్ కుమార్, జస్టిస్ కె.సురేష్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం…ఫోక్సో కోర్టు ఇచ్చిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చుతూ తీర్పు వెలువ‌రించింది. పోక్సో కేసుల విచారణ సందర్భంగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని ధర్మాసనం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది. దోషిలో మార్పు వచ్చే అవకాశం ఉన్నందున దిగువకోర్టు విధించిన మరణశిక్షను.. రెమిషన్ లేని జీవిత కారాగార శిక్షగా మార్చుతున్నట్లు ప్ర‌క‌టించింది.