AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2019 ఎన్నికల్లో పట్టుకున్న డబ్బు.. ఏపీకి రికార్డ్

అధికారం చేపట్టడానికి రాజకీయ నాయకులు ఎంతైనా ఖర్చు పెడతారు. లెక్క ఎంతన్నది పట్టించుకోకుండా గెలవడం కోసం ఉన్నదంతా పంచుతుంటారు. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో గెలవడానికి 50 కోట్లు కూడా ఖర్చు పెట్టిన నాయకులు ఉన్నారు. అలా దేశవ్యాప్తంగా నగదును ఏరులై పారించారు. అయితే ఎన్నికల సంఘం, పోలీసులు కలిసి ఎక్కడికక్కడ పెద్ద మొత్తంలో డబ్బు, మద్యం, ప్రజలను ప్రలోభపెట్టడానికి సిద్ధం చేసిన బహుమతులను పట్టుకున్నారు. ఇక వీటి గురించి ఓ లెక్క తీయగా […]

2019 ఎన్నికల్లో పట్టుకున్న డబ్బు.. ఏపీకి రికార్డ్
Ravi Kiran
|

Updated on: May 23, 2019 | 8:03 AM

Share

అధికారం చేపట్టడానికి రాజకీయ నాయకులు ఎంతైనా ఖర్చు పెడతారు. లెక్క ఎంతన్నది పట్టించుకోకుండా గెలవడం కోసం ఉన్నదంతా పంచుతుంటారు. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో గెలవడానికి 50 కోట్లు కూడా ఖర్చు పెట్టిన నాయకులు ఉన్నారు. అలా దేశవ్యాప్తంగా నగదును ఏరులై పారించారు.

అయితే ఎన్నికల సంఘం, పోలీసులు కలిసి ఎక్కడికక్కడ పెద్ద మొత్తంలో డబ్బు, మద్యం, ప్రజలను ప్రలోభపెట్టడానికి సిద్ధం చేసిన బహుమతులను పట్టుకున్నారు. ఇక వీటి గురించి ఓ లెక్క తీయగా ఏపీలో కళ్ళు చెదిరే రీతిలో నగదు దొరకడం విశేషం. ఎన్నికల వేళ ఏపీలో పట్టుకున్న సొమ్ము 216.34కోట్లుగా ఈసీ ప్రకటించింది. దేశం మొత్తం  మీద ఈ ఎన్నికల వేళ 2628 కోట్ల నగదును ఈసీ స్వాధీనం చేసుకుంటే ఏపీలో స్వాధీనం చేసుకున్న సొమ్ము అందులో పది శాతంగా ఉండడం విశేషం.  2014 ఎన్నికల్లో దొరికిన నగదు కంటే.. ఈసారి 75 కోట్లు అదనంగా దొరికిందని ఈసీ వెల్లడించింది. ఇక ఇలా భారీ మొత్తంలో నగదు దొరికినా.. మన రాజకీయ నాయకులు దొంగచాటుగా ఇంకెన్నో వందల కోట్లు జనానికి పంచారు. పైపైన చెక్ చేస్తేనే ఇన్ని కోట్లు దొరికితే ఇక సీరియస్‌గా చెక్ చేస్తే ఇంకెన్ని కోట్లు దొరుకుతాయో అని విమర్శలు కూడా వచ్చాయి.

ఏపీలో స్వాధీనం చేసుకున్న రూ.216.34 కోట్లలో 26.31 కోట్లు విలువైన 6.70 లక్షల లీటర్ల మద్యాన్ని పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక దీనిలో విశాఖ ఏజెన్సీ నుంచి తరలిస్తున్న రూ.50 లక్షల విలువైన గంజాయి కూడా ఉంది. మరోవైపు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల వేళ డబ్బు ఏరులై పారింది. ముఖ్యంగా ఏపీని మించి తమిళనాడులో భారీ మొత్తంలో నగదు దొరకడం గమనార్హం. తమిళనాడులో మొత్తం రూ.514 కోట్లు పట్టుబడగా… తెలంగాణలో రూ.77.49 కోట్లను సీజ్ చేశారు. ఇక సౌత్‌లో అత్యధిక సొమ్ము పట్టుబడిన రాష్ట్రంగా తమిళనాడు నిలవడం విశేషం.

NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..