నెగిటివ్ వచ్చిన మహిళకు కరోనా వార్డులో చికిత్స

గుంటూరు జిల్లా ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్య సిబ్బంది నిర్వాకంతో ఓ మహిళకి చేసిన కరోనా పరీక్ష ఫలితం రాక ముందే పాజిటివ్‌ గా నిర్ధారించి.. కొవిడ్‌ వార్డులో చేర్పించి చికిత్స అందించారు. ఫలితం వచ్చాక మెసేజ్ చూపించిన వదలలేదు. చివరికి రెండోసారి పరీక్షలోనూ నెగిటివ్ తేలడంలో తెల్లబోయారు. కరోనా బారినపడకున్నా 24 గంటల పాటు కొవిడ్ వార్డులో చికిత్సపొందింది ఆ మహిళ.

నెగిటివ్ వచ్చిన మహిళకు కరోనా వార్డులో చికిత్స
Follow us

|

Updated on: Aug 18, 2020 | 5:48 PM

గుంటూరు జిల్లా ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్య సిబ్బంది నిర్వాకంతో ఓ మహిళకి చేసిన కరోనా పరీక్ష ఫలితం రాక ముందే పాజిటివ్‌ గా నిర్ధారించి.. కొవిడ్‌ వార్డులో చేర్పించి చికిత్స అందించారు. ఫలితం వచ్చాక మెసేజ్ చూపించిన వదలలేదు. చివరికి రెండోసారి పరీక్షలోనూ నెగిటివ్ తేలడంలో తెల్లబోయారు. కరోనా బారినపడకున్నా 24 గంటల పాటు కొవిడ్ వార్డులో చికిత్సపొందింది ఆ మహిళ.

కొల్లిపరకు చెందిన ఓ మహిళ ఈనెల 12న ఛాతిలో నొప్పి రావడంతో గుంటూరు జిల్లా ఆస్పత్రిలోని అత్యవసర వైద్యసేవల కేంద్రానికి వెళ్లింది. దీంతో అమెను పరీక్షించిన వైద్య సిబ్బంది అత్యవసర పరీక్షలు చేయించారు. అటు కరోనా అనుమానంతో అక్కడి వైద్య సిబ్బంది సూచనల మేరకు కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని స్వాబ్‌ పరీక్ష చేయించారు. ఇక ఫలితం రావడానికి టైము పడుతుండడంతో ఆ మహిళ కరోనా వార్డు ఓపీ విభాగానికి పంపించి చికిత్స మొదలు పెట్టారు. ఆ మహిళకు ఈ నెల 16న మరోసారి స్వాబ్‌ పరీక్ష చేయించారు. ఇది జరిగిన ఓ గంట తరవాత కొల్లిపరలో ఇదివరకు చేయించుకున్న పరీక్షలో నెగిటివ్‌ అని నిర్థారణ అయిందని ఆమె సెల్ ఫోన్ నంబరుకు మెసేజ్ వచ్చింది. ఈ మేరకు తన వచ్చిన మెసేజ్ ను వైద్య సిబ్బందికి చూపించింది మహిళ. అయినా సరే కొవిడ్‌ వార్డులోకి వెళ్లాల్సిందేనని అనడంతో అక్కడ చేరిపోయింది. రెండో సారి జిల్లా ఆస్పత్రిలో చేయించిన పరీక్షలోనూ నెగిటివ్‌ అని నిర్ధరణ అయిందనే మెసేజ్ 17న మధ్యాహ్నం ఆమెకు వచ్చింది. దాన్ని ఆస్పత్రి సిబ్బందికి చూపించగా ఆన్‌లైన్‌లో పరిశీలించి వాస్తవమని తేల్చారు. సిబ్బంది నిర్వాకం వల్ల కొవిడ్‌ వార్డులోని బాధితుల మధ్య దాదాపు 24 గంటలు గడపాల్సి వచ్చింది ఆ మహిళ. ఈ వ్యవహారం మొత్తాన్ని ఆస్పత్రి సూపరిండెంట్ ని కలసి జరిగిందంతా వివరించారు. దీనిపై స్పందించిన ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్‌ ఎం.సనత్‌కుమారి ఇందుకు బాధ్యలైన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?