గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన హీరోయిన్ దిగాంగనా..
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు..
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను పూర్తి చేయించడం జరుగుతుంది.
ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించిన ప్రముఖ హీరోయిన్ దిగాంగనా సూర్యవంశీ. ముంబైలోని తన నివాసంలో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించింది. కాగా ఇది చాలా మంచి కార్యక్రమం అని, ఇందులోకి తనను ఆహ్వానించిన దర్శకుడు సంపత్ నందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని భాద్యతగా మొక్కలు నాటాలని పేర్కొంది దిగంగనా. ఈ సందర్భంగా తాను నాటిన మొక్కలను ట్విట్టర్ ఖాతాలో ఫ్యాన్స్తో పంచుకుంది.
Thank you so much sir ! We’re in this together ???? https://t.co/g6iIp8r9yu
— DiganganaSuryavanshi (@DiganganaS) July 18, 2020
Read More:
దేశంలో కరోనా విలయం.. రికార్డు స్థాయిలో కొత్తగా 38,902 కేసులు..