మార్కెట్‌లోకి హీరో మోటొకార్ప్ కొత్త స్కూటర్లు!

దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ తాజాగా మరో రెండు కొత్త స్కూటర్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఒకటి మాస్ట్రో ఎడ్జ్ 125 కాగా మరొకటి ప్లెజర్ ప్లస్ 110. హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్ ధర రూ.58,500 నుంచి ప్రారంభమౌతోంది. ఇక హీరో ప్లెజర్ ప్లస్ 110 స్కూటర్ ప్రారంభ ధర రూ.47,300గా ఉంది. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. ఫ్యూయల్ ఇంజక్షన్ టెక్నాలజీతో మార్కెట్‌లోకి వచ్చిన తొలి స్కూటర్ ఎడ్జ్ 125 అని కంపెనీ […]

మార్కెట్‌లోకి హీరో మోటొకార్ప్ కొత్త స్కూటర్లు!
Follow us

| Edited By:

Updated on: May 14, 2019 | 5:03 PM

దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ తాజాగా మరో రెండు కొత్త స్కూటర్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఒకటి మాస్ట్రో ఎడ్జ్ 125 కాగా మరొకటి ప్లెజర్ ప్లస్ 110. హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్ ధర రూ.58,500 నుంచి ప్రారంభమౌతోంది. ఇక హీరో ప్లెజర్ ప్లస్ 110 స్కూటర్ ప్రారంభ ధర రూ.47,300గా ఉంది. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. ఫ్యూయల్ ఇంజక్షన్ టెక్నాలజీతో మార్కెట్‌లోకి వచ్చిన తొలి స్కూటర్ ఎడ్జ్ 125 అని కంపెనీ పేర్కొంది. రెండు స్కూటర్లలోనూ యూఎస్‌బీ చార్జర్, ఎల్ఈడీ బూట్ ల్యాంప్, రియర్ టెయిల్ ల్యాంప్, ఫ్రంట్ పాకెట్స్, డిజిటల్ అనలాగ్ డాష్‌బోర్డ్ వంటి ప్రత్యేకతలున్నాయి.