AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర, క‌ర్నాట‌క‌లోని ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. కోస్తా తీర ప్రాంతాల్లో వ‌ర్షాల వ‌ల్ల న‌దులు ఉప్పొంగుతున్నాయి. దీంతో కర్నాటకలోని డ్యామ్ గేట్ల‌ను ఎత్తివేశారు అధికారులు.

పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
Balaraju Goud
|

Updated on: Aug 06, 2020 | 11:48 AM

Share

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర, క‌ర్నాట‌క‌లోని ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. కోస్తా తీర ప్రాంతాల్లో వ‌ర్షాల వ‌ల్ల న‌దులు ఉప్పొంగుతున్నాయి. దీంతో కర్నాటకలోని డ్యామ్ గేట్ల‌ను ఎత్తివేశారు అధికారులు. అటు, క‌లినాడి, క‌ద్రా న‌దుల్లోకి వ‌ర‌ద ప్రవాహాం వచ్చి చేరుతోంది. అనేక న‌దుల్లో నీటి ప్ర‌వాహం ప్రమాద స్థాయికి చేరుకుంది. దీంతో డ్యామ్‌ల నుంచి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు.

గత నాలుగైదు రోజులుగా కర్నాటకలో కలకొడ‌గు, కూర్గ్‌, గోక‌ర్ణ‌, చిక్‌మంగుళూరు, హ‌స‌న్‌, మైసూర్ ప్రాంతాల్లో భారీగా వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్త‌ర క‌న్న‌డ‌, ద‌క్షిణ క‌న్న‌డ‌, ఉడిపి జిల్లాలు వ‌ర్షాల వ‌ల్ల దెబ్బ‌తిన్నాయి. కావేరి న‌దిలోకి భారీగా వ‌ర‌ద నీరు చేరుతోంది. అటు కృష్ణా నదిలోకి భారీగానే వరద నీరు వస్తుంది. దీంతో కృష్ణా నదిపై ఎగువన ఉన్న డ్యామ్ లను కర్నాటక అధికారులు తెరుస్తున్నారు. దీంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో పెరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.