Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్‌న్యూస్.. నేటి నుంచి ఏపీలో రూ.15కే ఉల్లి

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. నేటి నుంచి ఏపీలో కిలో ఉల్లిని రూ.15లకే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొద్ది రోజుల నుంచీ ఉల్లి ధరలు ప్రజలను భయపెడుతోన్న విషయం తెలిసిందే. ఉల్లి ధరలు ఇంకా సామాన్యులకు అందుబాటులోకి రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా రైతుల నుంచి ఉల్లిని సేకరించి రాష్ట్రంలోని 101  రైతు బజార్లలో ఈ రోజు నుంచి కిలో రూ.15కే పంపిణీ చేయనుంది. కడప ఉల్లికి […]

గుడ్‌న్యూస్.. నేటి నుంచి ఏపీలో రూ.15కే ఉల్లి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 01, 2020 | 12:20 PM

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. నేటి నుంచి ఏపీలో కిలో ఉల్లిని రూ.15లకే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొద్ది రోజుల నుంచీ ఉల్లి ధరలు ప్రజలను భయపెడుతోన్న విషయం తెలిసిందే. ఉల్లి ధరలు ఇంకా సామాన్యులకు అందుబాటులోకి రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా రైతుల నుంచి ఉల్లిని సేకరించి రాష్ట్రంలోని 101  రైతు బజార్లలో ఈ రోజు నుంచి కిలో రూ.15కే పంపిణీ చేయనుంది. కడప ఉల్లికి కిలోకు రూ. 50 నుంచి రూ.60లు చెల్లించనుంది ప్రభుత్వం. కాగా.. రోజుకు 50 నుంచి 60 టన్నుల ఉల్లిని మార్కెటింగ్ శాఖ తెప్పించనుంది. వీటిని కిలో రూ.15కే వినియోగదారులకు అందించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో 130 రైతుబజార్లు ఉండగా, పెద్ద యార్డుల్లో మాత్రమే రాయితీ ఉల్లిని పంపిణీ చేస్తున్నారు. అయితే.. ఈజిప్టు, టర్కీ నుంచి కేంద్రం దిగుమతి చేసుకున్న ఉల్లి మాత్రం రాష్ట్రానికి వస్తే.. కిలో రూ.25ల చొప్పునే సరఫరా చేయాలని అధికారులు భావిస్తున్నారు.