AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వనస్థలిపురంలో రెచ్చిపోయిన గుర్తు తెలియని దుండగులు.. కార్పొరేటర్ కారు అద్దాలు ధ్వంసం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీఎన్ రెడ్డినగర్‌లో అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రెచ్చిపోయారు.

వనస్థలిపురంలో రెచ్చిపోయిన గుర్తు తెలియని దుండగులు.. కార్పొరేటర్ కారు అద్దాలు ధ్వంసం
Balaraju Goud
|

Updated on: Dec 11, 2020 | 7:16 AM

Share

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీఎన్ రెడ్డినగర్‌లో అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రెచ్చిపోయారు. వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని బీజేపీ పార్టీకి చెందిన బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ లచ్చిరెడ్డి కారు అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచిన లచ్చిరెడ్డి మొక్కు తీర్చుకునేందుకు కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి లచ్చిరెడ్డి ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఇటుక రాళ్లతో కొట్టి అద్దాలు ధ్వంసం చేశారు. లచ్చిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.