AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నలుగురు కుటుంబసభ్యుల అనుమానాస్పద మృతి

వనపర్తి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రేవల్లి మండలం నాగపూర్‌ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

నలుగురు కుటుంబసభ్యుల అనుమానాస్పద మృతి
Balaraju Goud
|

Updated on: Aug 14, 2020 | 12:39 PM

Share

వనపర్తి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రేవల్లి మండలం నాగపూర్‌ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌ గ్రామానికి చెందిన తల్లి ఆజీరాం బీ (63), కుమార్తె ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజాపాష (42), మనుమరాలు హసీన (10) ఇంట్లో వేర్వేరుచోట్ల విగతజీవులై పడి ఉన్నారు. వంటగదిలో ఆజీరాం బీ మృతదేహాన్ని, డైనింగ్‌ హాల్‌లో ఆస్మా బేగం మృతదేహాన్ని, ఇంటి వెనుక గుంతలో ఖాజాపాష మృతదేహాన్ని, హాల్‌లో హసీనా మృతదేహాలను గుర్తించారు.

శుక్రవారం ఉదయం 7గంటల దాటినా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా… నలుగురూ విగత జీవులై పడి ఉన్నారు. వెంటనే పోలీసులు, మృతుల బంధువులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. ఖాజా మృతదేహం పక్కన కొబ్బరికాయ, నిమ్మకాయలు కనిపించాయి. అక్కడే ఓ గొయ్యి తీసి ఉంది. ఇంట్లో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించినట్లు సమాచారం. జరిగిన ఘటన హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడంతో నాగపూర్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.