లాక్డౌన్ మద్యం అమ్ముతూ దొరికిన సినీ నటుడు
తాజాగా ఓ సినీ నటుడు లాక్ డౌన్ సమయంలో మద్యం విక్రయిస్తూ పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నాడు. లాక్ డౌన్ రోజులను క్యాష్ చేసుకునేందుకు ట్రై చేసి పోలీసులకు చిక్కాడు సదరు సినీ నటుడు. అతనితోపాటు మరికొందరిని పోలీసుల అరెస్టు చేశారు.
ప్రభుత్వాలు లాక్ డౌన్ పొడిగిస్తూ పోతుండడంతో మద్య ప్రియులను వర్రీలో ముంచెత్తుతోంది. మద్యం ప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు తమ వద్ద వున్న మద్యం బాటిళ్ళను మూడు, నాలుగు రెట్ల ధరలకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. వీరిలో కొందరు పోలీసులకు దొరికిపోతుంటే.. మరికొందరు మాత్రం దొరకడం లేదు. తాజాగా ఓ సినీ నటుడు లాక్ డౌన్ సమయంలో మద్యం విక్రయిస్తూ పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నాడు.
మద్యం క్వార్టర్ బాటిల్ మద్యాన్ని 1200 రూపాయల చొప్పున దొంగచాటుగా విక్రయిస్తున్న సినీ నటుడిని, అతని ఫ్రెండ్స్ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. లాక్డౌన్లో భాగంగా తమిళనాడులో మద్యం దుకాణాలను మూసివేశారు. దీంతో కొందరు దొంగ చాటుగా అధిక ధరలకు మద్యాన్ని అమ్ముతూ క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు.
చెన్నైలోని ఎంజీఆర్ నగర్, అన్నా మెయిన్రోడ్డులోని ఒక ఇంటిలో దొంగచాటుగా మద్యాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆదివారం అక్కడికి వెళ్లిన పోలీసులకు పలు మద్యం బాటిళ్లు దాచిన విషయం బయట పడింది. దీంతో వాటిని దొంగచాటుగా విక్రయిస్తున్న రిస్కాన్ (30) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో అతను సహాయ నటుడని తెలిసింది. అతను తన మిత్రుల నుంచి క్వార్టర్ మద్యం బాటిల్ను వెయ్యి రూపాయలకు కొనుగోలు చేసి ఇతరులకు రెండొందల లాభానికి అంటే 1200 రూపాయలకు ఇంటికే తీసుకెళ్లి విక్రయిస్తున్నట్లు చెప్పారు.
రిస్కాన్ ఇచ్చిన సమాచారంతో మరికొందరిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో చూలేమేడు, కామరాజ్నగర్ ప్రాంతాలకు చెందిన పలువురున్నారు. సాలిగ్రామ్కు చెందిన కాల్ టాక్సీ డ్రైవర్ దేవరాజ్, దివాకర్నగర్కు చెందిన ప్రదీప్లను పోలీసులు గుర్తించారు. దేవరాజ్ కారులో ఉన్న 189 క్వాటర్ మద్యం బాటిళ్లను, 20 వేల రూపాయల డబ్బుతో పాటు కారును పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు విచారణ జరుపుతున్నారు.