AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీకేయూ చీఫ్ భూపేందర్ సింగ్ మాన్ నిర్ణయం పట్ల రైతుల హర్షం, కమిటీలోని ఇతర సభ్యులు కూడా రావాలని విన్నపం

రైతుల సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ నుంచి భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు..,

బీకేయూ చీఫ్ భూపేందర్ సింగ్ మాన్ నిర్ణయం పట్ల రైతుల హర్షం, కమిటీలోని ఇతర సభ్యులు కూడా రావాలని విన్నపం
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 14, 2021 | 8:15 PM

Share

రైతుల సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ నుంచి భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ భూపేందర్ సింగ్ మాన్ వైదొలగడంపట్ల ట్రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కమిటీలోని మిగతా ముగ్గురు సభ్యులు కూడా ఇలాగే బయటకు రావాలని వారు కోరారు. అసలు కమిటీని ఏర్పాటు చేయాలని తాము కోర్టును కోరనేలేదన్నారు. మాన్ కూడా తమ ఆందోళనలో పాల్గొనాలని తాము కోరుతున్నట్టు గుర్నామ్ సింగ్ అనే రైతు నేత తెలిపారు. మాన్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని, కోర్టు ముందు గానీ, కమిటీ ముందు గానీ రైతులెవరూ హాజరు కాబోరన్న విషయం ఆయనకు తెలుసునని గుర్నామ్ సింగ్ అన్నారు. అన్నదాతల జీవితాలతో కేంద్రం ఆటలాడుతోందని ఆయన ఆరోపించారు. మా ఆందోళన మొదలై సుమారు రెండు నెలలవుతున్నా కేంద్రం ఏ మాత్రం స్పందించక పోవడం చూస్తే వివాదాస్పద చట్టాలను రద్దు చేస్తుందన్న నమ్మకం పోయిందని ఆయన దుయ్యబట్టారు.

Read Also: కీలక నిర్ణయం తీసుకున్న రైతు సంఘం నాయకులు… ఢిల్లీకి వచ్చే ఆ ఐదు మార్గాలను మూసేస్తాం.. Read Also:రైతుల ఆందోళనపై ఏం చేద్దాం ? మంత్రులు రాజ్ నాథ్, తోమర్ లతో హోం మంత్రి అమిత్ షా చర్చలు.