AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్ ఎత్తివేయ‌క‌పోతే.. ఎల‌న్ మ‌స్క్‌ హెచ్చరిక..

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో జ‌నం ఇళ్లకే ప‌రిమిత‌మ‌య్యారు. పారిశ్రామిక, వాణిజ్య‌ కార్యకలాపాలు ఎక్క‌డిక‌క్క‌డే నిలిచిపోయాయి. అయితే, ఇప్పుడిప్పుడే సాధార‌ణ ప‌రిస్థితులు

లాక్‌డౌన్ ఎత్తివేయ‌క‌పోతే.. ఎల‌న్ మ‌స్క్‌ హెచ్చరిక..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 10, 2020 | 3:17 PM

Share

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో జ‌నం ఇళ్లకే ప‌రిమిత‌మ‌య్యారు. పారిశ్రామిక, వాణిజ్య‌ కార్యకలాపాలు ఎక్క‌డిక‌క్క‌డే నిలిచిపోయాయి. అయితే, ఇప్పుడిప్పుడే సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. దీంతో ప‌లు దేశాల్లో మూత‌ప‌డ్డ ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపార సంస్థ‌లు మెల్ల‌మెల్ల‌గా తెర‌చుకుంటున్నాయి. ఇదే క్ర‌మంలో అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాల పునరుద్ధరణకు అనుమతులు ల‌భించాయి.

కాగా.. క‌రోనా వైరస్‌ ధాటికి తీవ్రంగా ప్రభావితమైన కాలిఫోర్నియాలో మాత్రం ఇంకా లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో అదే రాష్ట్రంలో ఉన్న టెస్లా ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీలో ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు అవకాశం లేకుండా పోయింది. దీనిపై టెస్లా సీఈవో ఎల‌న్ మ‌స్క్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. వెంటనే ఉత్పత్తిని ప్రారంభించ‌డానికి అనుమతించకపోతే సంస్థ ప్రధాన కార్యలయాన్ని కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌ లేదా నెవాడాకు తరలిస్తామంటూ స్థానిక ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

[svt-event date=”10/05/2020,3:07PM” class=”svt-cd-green” ]

[/svt-event]