దేశీయ విమానాలు తిరగవని ఢిల్లీ సీఎం.. తిరుగుతాయని సివిల్ ఏవియేషన్..?
ప్రస్తుతం కోవిద్ 19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీయ విమానాల సేవలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సివిల్ ఏవియేషన్ అధికారులు పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేశారు. ఢిల్లీ లాక్డౌన్ ప్రకటించే సమయంలో
ప్రస్తుతం కోవిద్ 19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీయ విమానాల సేవలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సివిల్ ఏవియేషన్ అధికారులు పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేశారు. ఢిల్లీ లాక్డౌన్ ప్రకటించే సమయంలో దేశీయ విమానాలు కూడా తిరగవని స్వయంగా సీఎం కేజ్రీవాల్ ప్రకటించిన కొద్ది సేపటికే… సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ స్పందిస్తూ… ఢిల్లీ విమానాశ్రయం నుంచి దేశీయ విమానాలు యథాతథంగానే పనిచేస్తాయని ప్రకటించారు. ‘‘ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానం ఢిల్లీ నుంచి దేశీయ విమానాలు యథాతథంగా పనిచేస్తాయి. విమానాశ్రయం యథావిధిగా పనిచేస్తుంది’’ అని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ ప్రకటించారు.
[svt-event date=”22/03/2020,9:17PM” class=”svt-cd-green” ]
Directorate General of Civil Aviation (DGCA) clarifies – Domestic flights to and from Indira Gandhi International Airport shall continue to operate and the airport shall remain functional. https://t.co/LKRnZGKLfX pic.twitter.com/D0HeTbJ3EJ
— ANI (@ANI) March 22, 2020
[/svt-event]