AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఆగని బాంబుల మోత..దద్దరిల్లిన రాజధాని కాబూల్..డిప్యూటీ గ‌వ‌ర్నర్ టార్గెట్‌గా బాంబు దాడి

ఆఫ్ఘనిస్తాన్‌లో బాంబుల మోత కొనసాగుతోంది. రాజధాని కాబూల్‌ మరోసారి దద్దరిల్లింది. మంగళవారం ఉదయం నగరంలోని మాక్రోరాయన్ ప్రాంతంలో కాబూల్‌ డిప్యూటీ గ‌వ‌ర్నర్‌ మోహిబుల్లా మొహ‌మ్మది ప్రయాణిస్తున్న కారు లక్ష్యంగా శక్తివంతమైన బాంబు పేలింది.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఆగని బాంబుల మోత..దద్దరిల్లిన రాజధాని కాబూల్..డిప్యూటీ గ‌వ‌ర్నర్ టార్గెట్‌గా బాంబు దాడి
Sanjay Kasula
| Edited By: uppula Raju|

Updated on: Dec 16, 2020 | 12:08 AM

Share

ఆఫ్ఘనిస్తాన్‌లో బాంబుల మోత కొనసాగుతోంది. రాజధాని కాబూల్‌ మరోసారి దద్దరిల్లింది. మంగళవారం ఉదయం నగరంలోని మాక్రోరాయన్ ప్రాంతంలో కాబూల్‌ డిప్యూటీ గ‌వ‌ర్నర్‌ మోహిబుల్లా మొహ‌మ్మది ప్రయాణిస్తున్న కారు లక్ష్యంగా శక్తివంతమైన బాంబు పేలింది. ఈ ఘటనలో మొహ‌మ్మదితో పాటు మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఆయనతో ప్రయాణిస్తున్న ఇద్దరు అంగ రక్షకులు తీవ్రగాయాలపాలయ్యారు..

కాబూల్‌ నగరంలో ఉగ్రవాదులు మరో దారుణానికి కూడా పాల్పడ్డారు. పోలీసులు లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ అధికారి మరణించారు. ఓ పోలీసు సిబ్బంది గాయపడ్డారని కాబూల్ పోలీసు చీఫ్ ప్రతినిధి ఫెర్డాస్ ఫరామార్జ్ తెలిపారు. ఈ రెండు ఘటనలతపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన అన్నారు.

ఆఫ్ఘన్‌ రాజధాని కాబూల్‌లో జరిగిన ఈ రెండు ఘటనలకు ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత స్వీకరించలేదు. అయితే ఈ దాడుల వెనుక ఇస్లామిక్‌ స్టేట్‌ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. గత కొద్ది నెలలుగా ఐసిస్‌ దాడుల్లో సుమారు 50 మంది మరణించారు. తాలిబన్లకు, ఆప్ఘన్‌ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న శాంతి చర్చల నేపథ్యంలో ఉగ్రవాదులు మరింత రెచ్చిపోయి మారణకాండ సృష్టిస్తున్నారు.