Delhi: ఎప్పుడూ లేని సంక్షోభంలో పడిపోయాం.. ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా అడుగంటాయి..వెల్లడించిన అరవింద్ కేజ్రీవాల్

కరోనా రెండో వేవ్ ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. కేంద్రం అన్నీ సరిగానే ఉన్నాయని చెబుతున్నా పలు రాష్ట్రాలు మందులు.. ఆక్సిజన్..బెడ్లు అందుబాటులో లేవని చెబుతున్నాయి.

Delhi: ఎప్పుడూ లేని సంక్షోభంలో పడిపోయాం.. ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా అడుగంటాయి..వెల్లడించిన అరవింద్ కేజ్రీవాల్
Kejriwal
Follow us

|

Updated on: Apr 17, 2021 | 7:31 PM

Delhi: కరోనా రెండో వేవ్ ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. కేంద్రం అన్నీ సరిగానే ఉన్నాయని చెబుతున్నా పలు రాష్ట్రాలు మందులు.. ఆక్సిజన్..బెడ్లు అందుబాటులో లేవని చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి ఒక పెద్ద బాంబు పేల్చారు. గత 24 గంటల్లో ఎన్నడూ లేనివిధంగా 24,000 కొత్త కరోనా వైరస్ కేసులను నమోదు చేయడంతో, నగరం వేగంగా పడకలు, ఆక్సిజన్ అలాగే ప్రాణాలను రక్షించే రేమిడిసివార్ కూడా అందుబాటులో లేని పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పారు. పాజిటివిటీ రేటు 24 శాతానికి చేరుకుంది – అంటే పరీక్షించబడుతున్న వారిలో నలుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్ వస్తోందని ఆయన అన్నారు.

“పరిస్థితి చాలా తీవ్రమైనది అలాగే ఆందోళన కలిగించేది” అని కేజ్రీవాల్ అన్నారు. “కేసులు చాలా వేగంగా పెరిగాయి. అందువల్ల కొన్ని రోజుల క్రితం వరకు ప్రతిదీ అదుపులో ఉన్నట్లు అనిపించినప్పటికీ మేము కొరతను ఎదుర్కొంటున్నాము. అయితే ఈ కరోనా ఎంత వేగం పెరుగుతుందో, దాని అంతం ఎక్కడ వరకూ తీసుకెళుతుందో ఎవరికీ తెలియదు” అని ఆయన చెప్పారు.

ఢిల్లీ తొ సహా భారతదేశంలోని ప్రధాన నగరాలను శనివారం వారాంతపు లాక్ డౌన్ లోకి కరోనా తీసుకువెళ్ళింది, దేశం తీవ్రమైన కొత్త కరోనావైరస్ తరంగాన్ని ఎదుర్కొంటుంది, రోజువారీ 2.3 లక్షలకు పైగా కేసులు వస్తున్నాయి. దీంతో అనేక రాష్ట్రాలు డ్రగ్స్ అలాగే హాస్పిటల్ పడకల కోసం ఇబ్బంది పడుతున్నాయి. అంతా బావుందనుకున్న తరుణంలో ఈ నెలలోనే 20 లక్షలకు పైగా కొత్త కేసులను భారతదేశం చూస్తుండటంతో దేశం మహమ్మారిని ఓడించిందనే ఆశలు ఆవిరయిపోయాయి. శనివారం దేశంలో 2.34 లక్షల కేసులు నమోదయ్యాయి, 1,341 మరణాలు నమోదు కావడం మొత్తం మహమ్మారి కారణంగా జరిగిన మరణాల సంఖ్య175,649కు చేరింది.

Also Read: కరోనా విజ‌‌ృంభణపై అప్రమత్తమైన కేంద్రం.. మరికాసేపట్లో ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ కీలక సమావేశం

భూమిలో తెల్లని ‘లోదుస్తులను’ పాతిపెడుతున్న ప్రజలు.. అసలు రహస్యం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.?

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..