AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు..

రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ,వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు..
Ravi Kiran
|

Updated on: Jun 24, 2020 | 7:10 AM

Share

రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలు లాగానే డిగ్రీ, పీజీ,వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించకపోవడమే శ్రేయస్కరం అని జగన్ సర్కార్ భావించింది. డిగ్రీ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులను ప్రమోట్ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. చివరి సెమిస్టర్ రద్దు నేపథ్యంలో గ్రేడింగ్, ఇంటర్నల్ మార్కులపై యూనివర్సిటీలు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కాగా, కరోనా కారణంగా ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి విదితమే.

Follow Us