AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ తీగ జాతి మొక్క నుంచి కరోనా ఔషధం… అనుమతి కోసం చూస్తున్న సీఎస్ఐఆర్..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచం మొత్తం లాక్ డౌన్‌లో ఉండిపోయింది. అయితే.. కోక్యులస్ హిర్సుటస్ అంటే మెజారిటీ ప్రజలకు తెలియకపోవచ్చు కానీ, చీపురుతీగ, దూసరతీగ అంటే మాత్రం

ఈ తీగ జాతి మొక్క నుంచి కరోనా ఔషధం... అనుమతి కోసం చూస్తున్న సీఎస్ఐఆర్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 25, 2020 | 8:42 PM

Share

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచం మొత్తం లాక్ డౌన్‌లో ఉండిపోయింది. అయితే.. కోక్యులస్ హిర్సుటస్ అంటే మెజారిటీ ప్రజలకు తెలియకపోవచ్చు కానీ, చీపురుతీగ, దూసరతీగ అంటే మాత్రం పల్లెటూళ్లలో ఉండే చాలామంది గుర్తుపట్టేస్తారు. తీగ జాతికి చెందిన ఈ మొక్క ఇప్పుడు శాస్త్రవేత్తల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే చీపురుతీగ నుంచి తయారుచేసిన ఔషధం డెంగ్యూపై పరీక్షించారు. అయితే దీని సమర్థత కరోనా వైరస్ పై ఏ మేరకు ఉంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఈ వృక్ష ఆధారిత ఔషధంపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఎన్నో ఆశలు పెట్టుకుంది.

కాగా.. ఈ ఔషధం పనితీరును అంచనా వేసేందుకు ప్రయోగాలు నిర్వహించాలని సీఎస్ఐఆర్ భావిస్తోంది. ఈ మేరకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)కి దరఖాస్తు చేసుకుంది. పరిమితి సంఖ్యలో 50 మంది రోగులపై పరీక్షలు జరిపి ఈ ఔషధం సమర్థతను తెలుసుకోవాలని సీఎస్ఐఆర్ భావిస్తోంది. కోక్యులస్ హిర్సుటస్ నుంచి తయారుచేసిన ఔషధంలో యాంటీ వైరల్ ఎలిమెంట్లు పుష్కలంగా ఉన్నందున డెంగ్యూపై ప్రాథమిక పరీక్షల్లో ప్రభావవంతంగా పనిచేసిందని సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. న్ని దేశంలోని గిరిజనులు ఉపయోగిస్తుంటారని వెల్లడించారు.