AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: ఎమ్మార్వో ఆఫీస్ ముందు పెట్రోల్ బాటిల్‌తో వ్యక్తి హల్‌చల్

Crime: భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్‌తో తహశీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చి హల్‌చల్ చేశాడు. రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. తన సమస్యను పరిష్కరించడం లేదని ఆరోపించాడు. తనకు న్యాయం చేయకపోతే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకుంటానని బెదిరించాడు. సంగారెడ్డి తహశీల్దారు కార్యాలయం ఎదుట చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లికి చెందిన ప్రసాద్‌, ఆయన సోదరుల మధ్య కొంతకాలంగా భూ వివాదం […]

Crime: ఎమ్మార్వో ఆఫీస్ ముందు పెట్రోల్ బాటిల్‌తో వ్యక్తి హల్‌చల్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 20, 2020 | 3:23 PM

Share

Crime: భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్‌తో తహశీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చి హల్‌చల్ చేశాడు. రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. తన సమస్యను పరిష్కరించడం లేదని ఆరోపించాడు. తనకు న్యాయం చేయకపోతే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకుంటానని బెదిరించాడు. సంగారెడ్డి తహశీల్దారు కార్యాలయం ఎదుట చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లికి చెందిన ప్రసాద్‌, ఆయన సోదరుల మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా రెవెన్యూ కార్యాలయంలోని వీఆర్వోను సంప్రదించగా.. తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని ప్రసాద్ ఆరోపించాడు. గత మూడేళ్లుగా ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా.. తన సమస్య పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మనస్తాపంతో ఎమ్మార్వో ఆఫీస్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన పోలీసులు అతడి చేతిలోని బాటిల్‌ను లాగేసుకున్నారు. అతన్ని సముదాయించి, కౌన్సిలింగ్ ఇచ్చారు.