AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కేసులు.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా..

కరోనా వైరస్ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏపీలో కొత్తగా 138 కేసులు న‌మోదు కాగా, తెలంగాణలో శుక్రవారం నాడు కొత్తగా మరో 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా కేసులు.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా..
Ravi Kiran
|

Updated on: Jun 06, 2020 | 9:10 AM

Share

కరోనా వైరస్ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏపీలో కొత్తగా 138 కేసులు న‌మోదు కాగా, తెలంగాణలో శుక్రవారం నాడు కొత్తగా మరో 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో అత్యధిక కేసులు గ్రేటర్ హైదరాబాద్‌లోనే 116 నమోదవ్వగా.. రంగారెడ్డి 8, ఆదిలాబాద్ 2,మేడ్చల్ 2, సంగారెడ్డి 2, ఖమ్మం 2, వరంగల్ 3, మహబూబ్‌నగర్ 5, మంచిర్యాల 1, కరీంనగర్‌లో 2 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.

దీనితో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3,290కి చేరింది. వీరిలో 1627 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. మరో 1,550 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి ఎనిమిది మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 113కి చేరింది.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. రాష్ట్రంలో కొత్త‌గా 138 కేసులు న‌మోదు అయ్యాయి. వాటిలో వివిధ జిల్లాల‌కు చెందిన వారు 50మంది, వ‌ల‌స కూలీలు 84మందికి, ఎన్ఆర్ఐలు న‌లుగురికి క‌రోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో న‌మోదైన కేసుల సంఖ్య 4250కి చేరింది. వాటిలో 13 జిల్లాల‌లో 3427కేసులు, విదేశాల నుంచి వ‌చ్చిన 123 కేసులు, వ‌ల‌స కూలీలకు చెందిన 700 కేసులున్నాయి. కరోనాతో తాజాగా కృష్ణాజిల్లాలో ఇద్ద‌రు మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 73మంది మ‌ర‌ణించారు. ఇప్పటివరకు 2294 మంది వివిధ జిల్లాలోనూ, వ‌ల‌స కూలీలు 258 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1060యాక్టివ్ కేసులు ఉండ‌గా, విదేశాల నుంచి వ‌చ్చిన 119 మంది, వ‌ల‌స కూలీలు 442 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందు‌తున్నారు.

Also Read:

గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..

ఏపీలో మరిన్ని సడలింపులు.. ఆలయాలు, హోటల్స్, మాల్స్‌కు నయా రూల్స్…

కిమ్ ఆస్తుల ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, బెంగళూరుకు బస్సులు.. కానీ!