Coronavirus: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపధ్యంలోనే నెలాఖరు దాకా బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పని చేస్తాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి ప్రకటించింది. కొత్త అకౌంట్లు ఓపెన్ చేయడం.. రుణాలు మంజూరు చేయడం వంటి సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. బ్యాంకులు 50 శాతం మంది సిబ్బందితోనే పని చేస్తాయని.. అటు కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం వాటిని పూర్తిగా మూసివేస్తున్నట్లు బ్యాంకర్ల సమితి వెల్లడించింది.
కాగా, తెలంగాణలో 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఏపీలో 6 కేసులు నమోదయ్యాయి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి ముందస్తు చర్యలు పాటించడమే కాకుండా 1897 ఎపిడెమిక్ యాక్ట్ను ఏడాది పాటు అమలులోకి తీసుకొచ్చింది.
For More News:
ఫ్లాష్: భారత్లో ఎనిమిదో కరోనా డెత్.. 425కు చేరుకున్న పాజిటివ్ కేసులు..
ఏపీ ప్రభుత్వం సంచలనం.. పేదల ఇళ్ల కోసం స్విస్ టెక్నాలజీ..
షాకింగ్: కరోనా వైరస్తో హీరోయిన్ తండ్రి మృతి…
కరోనా కట్టడికి మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం…
ఏపీ లాక్ డౌన్: ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలి..
రోహిత్కు కోపమొచ్చింది.. ఐసీసీ క్షమాపణ చెప్పింది..
కోరలు చాస్తున్న కరోనా.. భారత్లో 9కి చేరిన మృతుల సంఖ్య..