ఏపీలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు…

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,548 పాజిటివ్ కేసులు, 82 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,14,164కి చేరింది.

ఏపీలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు...
Follow us

|

Updated on: Aug 29, 2020 | 7:10 PM

Corona Cases Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,548 పాజిటివ్ కేసులు, 82 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,14,164కి చేరింది. ఇందులో 97,681 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,12,687 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో మృతుల సంఖ్య 3796కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. అటు గడిచిన 24 గంటల్లో 8,976 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1096 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..)

ఇక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 36,03,345 టెస్టులు నిర్వహించారు. జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 864, చిత్తూరులో 813, తూర్పు గోదావరిలో 1096, గుంటూరులో 635, కడపలో 991, కృష్ణాలో 362, కర్నూలులో 791, నెల్లూరులో 1038, ప్రకాశంలో 870, శ్రీకాకుళంలో 522, విశాఖలో 988, విజయనగరంలో 715, పశ్చిమ గోదావరిలో 863 కేసులు నమోదయ్యాయి.