AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో కొత్తగా 20,021 పాజిటివ్ కేసులు, 279 మరణాలు.. క్రమక్రమంగా పెరుగుతోన్న రికవరీ రేటు…

Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో 20,021 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,07,871..

దేశంలో కొత్తగా 20,021 పాజిటివ్ కేసులు, 279 మరణాలు.. క్రమక్రమంగా పెరుగుతోన్న రికవరీ రేటు...
India corona latest updates
Ravi Kiran
|

Updated on: Dec 28, 2020 | 10:27 AM

Share

Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో 20,021 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,07,871 చేరుకుంది. ఇందులో 2,77,301 యాక్టివ్ కేసులు ఉండగా.. 97,82,669 కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజాగా 279 మంది వైరస్ కారణంగా చనిపోవడంతో.. దేశంలో ఇప్పటివరకు 1,47,901 కరోనా మరణాలు సంభవించాయి.

అటు గత కొద్దిరోజులుగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల లేకపోవడం ఊరటను ఇచ్చే అంశం. అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ రేటు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో శనివారం 21,131 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 2.72 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.45 శాతానికి తగ్గింది. దేశంలో 95.83 శాతానికి రికవరీ రేటు చేరిందంది.

Also Read:

హైదరాబాద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో సోనూసూద్ సందడి.. చెప్పకుండానే అభిమాని ఇంటికి వచ్చిన రియల్ హీరో..!

కాంట్రాక్టు అధ్యాపకులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు.!

 ఏపీలో కొత్త ‘స్ట్రెయిన్’ కలవరం.. యూకే నుంచి వచ్చినవారిలో నలుగురికి పాజిటివ్.!