AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జైపాల్ మరణం పార్టీకి తీరని లోటు.. : కాంగ్రెస్ నేతలు

కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సందర్భంగా జైపాల్‌తో తమకున్న అనుబంధాన్ని తలుచుకుని రాజకీయ నేతలు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. సీనియర్ పొలిటిషీయన్ జైపాల్ రెడ్డి లేరన్న వార్త కాంగ్రెస్ నేతలతో పాటు.. పలువురు రాజకీయ నేతల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్ రెడ్డి జైపాల్ రెడ్డి […]

జైపాల్ మరణం పార్టీకి తీరని లోటు.. : కాంగ్రెస్ నేతలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 28, 2019 | 9:45 AM

Share

కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సందర్భంగా జైపాల్‌తో తమకున్న అనుబంధాన్ని తలుచుకుని రాజకీయ నేతలు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.

సీనియర్ పొలిటిషీయన్ జైపాల్ రెడ్డి లేరన్న వార్త కాంగ్రెస్ నేతలతో పాటు.. పలువురు రాజకీయ నేతల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్ రెడ్డి జైపాల్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించారు. జైపాల్ మచ్చలేని మహానేత అని కొనియాడారు. ఆయన గుర్తుగా స్మారక స్థూపం ఏర్పాటు చేయాలని కొమటిరెడ్డి అన్నారు.

జైపాల్ మృతిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. జైపాల్ మరణం తనను ఎంతో బాధించిందిని ట్విట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు జైపాల్ కేంద్రానికి వివరించారని.. రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో కృషి చేశారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు. ఎలాంటి అవినీతి మచ్చలేని నాయకుడిగా జైపాల్ పేరు సంపాధించారని కొనియాడారు.