AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రపతి, ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ, రెండు రిక్వెస్టులు, రిప్లై వస్తుందా ?

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కేంద్రంపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..తాజాగా ప్రధానికి కీలక లేఖను సంధించారు.

రాష్ట్రపతి, ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ, రెండు రిక్వెస్టులు, రిప్లై వస్తుందా ?
Ram Naramaneni
|

Updated on: Nov 20, 2020 | 11:57 AM

Share

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కేంద్రంపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..తాజాగా ప్రధానికి కీలక లేఖను సంధించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని కోరారు. హిందీ, ఇంగ్లీషు భాషల్లోనే ఎగ్జామ్స్ నిర్వహించడం వల్ల ఇతర అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో వివరించారు. చాలా రాష్ట్రాల్లో యువకులు నష్టపోతున్నారని వివరించారు. అన్ని ప్రాంతాల అభ్యర్థులకు సమాన అవకాశాలు ఇచ్చే విధంగా ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్, బ్యాంకింగ్, డిఫెన్స్, రైల్వేస్ పోటీ పరీక్షలను కేవలం హిందీ, ఇంగ్లీషు భాషల్లోనే నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు.

అలాగే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మరో లేఖ రాశారు ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు స్మారక తపాలా స్టాంప్‌నకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ విడిదికి వచ్చినప్పుడు పీవీ స్మారక తపాలా స్టాంప్‌ను రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Also Read : 

వారెవ్వా.. అతడికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది..ఒక్క రోజులో కోటీశ్వరుడు

పెంపుడు శునకంపై మితిమీరిన ప్రేమ..యువతి ఆత్మహత్య..అక్కడే పూడ్చిపెట్టాలంటూ..