AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డు మీదకు వచ్చేవారిని.. ఓ చూపు చూస్తున్న ‘థర్డ్‌ ఐ’

కోవిద్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. లాక్‌డౌన్ కొనసాగుతోంది.. గడప దాటి బయటకు రావద్దు.. ఇది పోలీసుల హెచ్చరిక. కాని కొంత మంది దీన్ని బ్రేక్

రోడ్డు మీదకు వచ్చేవారిని.. ఓ చూపు చూస్తున్న 'థర్డ్‌ ఐ'
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 29, 2020 | 6:10 PM

Share

కోవిద్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. లాక్‌డౌన్ కొనసాగుతోంది.. గడప దాటి బయటకు రావద్దు.. ఇది పోలీసుల హెచ్చరిక. కాని కొంత మంది దీన్ని బ్రేక్ చేస్తూ.. రోడ్లపైకి వస్తున్నారు. పోలీసుల కళ్లు గప్పి.. తిరుగుతున్నారు. అయితే రోడ్డపైకి వచ్చే వారినికి థర్డ్ ఐ ఎప్పుడూ కనిపెడుతూనే ఉంటుందని చెప్తున్నారు పోలీసులు.

కాగా.. లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తున్నవారిపై తెలంగాణ పోలీసులు సిటీజన్ ట్రాకింగ్ యాప్ తో కేసు నమోదు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ కాప్ యాప్ తో పాటు సిటిజన్ ట్రాకింగ్ అప్లికేషన్ తో వయోలేషన్స్ రికార్డ్ చేస్తున్నారు. లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఆదివారం వరకు 11,266 వెహికిల్స్ ట్రాక్ చేయగా ఇందులో 3 కిలోమీటర్లు దాటి ప్రయాణించిన 2,648 మంది వాహనదారులను గుర్తించి కేసులు నమోదు చేశారు.

ట్రాకింగ్ లో మొదటి సారి రికార్డైన వాహనదారులు 3 కిలోమీటర్లు దాటి ప్రయాణిస్తే కేసులు రిజిస్టర్ చేశారు. ఇందులో అత్యధికంగా 2779 వెహికిల్స్ ను సిటిజన్ ట్రాకింగ్ తో రికార్డ్ చేశారు. ఇందులో పరిధి దాటి ప్రయాణించిన 645 వాహనదారులపై వాయిలేషన్ కేసులు రిజిస్టర్ చేశారు. దీంతో పాటు ఖమ్మంలో 2316 వెహికిల్స్ ను రికార్డ్ చేస్తే అందులో 734 మంది వాహనదారులను ట్రాక్ చేశారు.