AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిత్తూరులో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉప్పొంగిన గంగినేని చెరువు

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో చిత్తూరు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గంగినేని చెరువు ఉప్పొంగింది. ఓవర్

చిత్తూరులో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉప్పొంగిన గంగినేని చెరువు
Venkata Narayana
| Edited By: |

Updated on: Nov 27, 2020 | 7:37 AM

Share

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో చిత్తూరు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అర్థరాత్రి గంగినేని చెరువు ఉప్పొంగింది. ఓవర్ బ్రిడ్జి సమీపంలోని చెన్నారెడ్డి కాలనీని ఒక్కసారిగా గంగినేని చెరువు వంక ముంచెత్తింది. నడుములోతు చెరువు నీటిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ చిక్కుకుపోయింది. 34 మంది కాలనీవాసులు నిరాశ్రయులయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చిత్తూరు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

రెండు గంటలు శ్రమించి కాలనీ వాసులతో పాటు నీటి ముంపు ప్రాంతాలలో ఉన్న మరికొంత మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు, నివర్ తుఫాను నేపథ్యంలో డి‌జి‌పి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.