Chetan Sharma : సెలక్షన్ ప్యానెల్ చైర్మన్గా చేతన్ శర్మ నియామకం..కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ
బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్గా మారుతోంది. టీమిండియా మాజీ పేసర్ చేతన్ శర్మను సీనియర్ నేషనల్ సెలక్షన్ ప్యానెల్ చైర్మన్గా నియమిస్తూ బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ గురువారం నిర్ణయం తీసుకుంది.
Chetan Sharma : బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్గా మారుతోంది. టీమిండియా మాజీ పేసర్ చేతన్ శర్మను సీనియర్ నేషనల్ సెలక్షన్ ప్యానెల్ చైర్మన్గా నియమిస్తూ బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ గురువారం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు సభ్యుల జట్టులో అబే కురువిల్లా, దేవాశిష్ మొహంతిలను కూడా చేర్చింది.
గురువారం అహ్మదాబాద్లో జరిగిన బీసీసీఐ 89వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సెలక్షన్ ప్యానెల్లో టీమండియా మాజీ ఆటగాళ్లు సునీల్ జోషి, హర్విందర్ సింగ్ కూడా ఉన్నారు.
Based on CAC’s recommendations Mr Chetan Sharma, Mr Abey Kuruvilla and Mr Debashish Mohanty have been appointed to the senior selection committee. Mr Sharma will be head the selection panel.
Details ? https://t.co/05nmQMBAVh pic.twitter.com/XIUDDiRGzY
— BCCI (@BCCI) December 24, 2020
చేతన్ శర్మ భారత్ తరపున 23 టెస్టులు, 65 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు.మొత్తం 11 ఏళ్లపాటు సాగిన అతడి అంతర్జాతీయ కెరియర్లో 1987 ప్రపంచకప్లో హ్యాట్రిక్ ఒక చెరగని గుర్తు. చేతన్ శర్మ 16 ఏళ్ల వయసులోనే హర్యానా తరపున ఫస్ట్క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. 18 ఏళ్ల వయసులో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అంతకంటే ఏడాది ముందు అంటే డిసెంబరు 1983లో విండీస్తో జరిగినే మ్యాచ్తో వన్డేలో అడుగుపెట్టాడు.
UPDATE – The Board of Control for Cricket in India held its 89th Annual General Meeting on Thursday at Ahmedabad.
More details – https://t.co/wUD8TX1QaT pic.twitter.com/MK3THN4qdM
— BCCI (@BCCI) December 24, 2020