AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోతిరెడ్డిపాడుపై స్పందించిన‌​ కేంద్ర జ‌లవనరుల శాఖ మంత్రి

ఇరు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం మ‌రింత ముదురుతుంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ రాసిన లేఖపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్​ స్పందించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ తెచ్చిన జీవో వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని కేంద్ర మంత్రికి… బండి సంజయ్ మంగళవారం లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి వెంటనే విచారణ జరుపుతామని తెలిపారు. రెండు రోజుల్లో వాస్తవాలు తెలపాలని కృష్ణానదీ మేనేజ్​మెంట్​ […]

పోతిరెడ్డిపాడుపై స్పందించిన‌​ కేంద్ర జ‌లవనరుల శాఖ మంత్రి
Ram Naramaneni
|

Updated on: May 13, 2020 | 10:56 PM

Share

ఇరు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం మ‌రింత ముదురుతుంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ రాసిన లేఖపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్​ స్పందించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ తెచ్చిన జీవో వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని కేంద్ర మంత్రికి… బండి సంజయ్ మంగళవారం లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి వెంటనే విచారణ జరుపుతామని తెలిపారు. రెండు రోజుల్లో వాస్తవాలు తెలపాలని కృష్ణానదీ మేనేజ్​మెంట్​ బోర్డును ఆదేశించారు.