కంగనాకు ఎందుకు భద్రత కల్పించలేదు: బీజేపీ నేత
బాలీవుడ్కి డ్రగ్స్ మాఫియాతో ఉన్న సంబంధాలపై ట్వీట్ చేసినా నటి కంగనా రనౌత్కి ఎందుకు భద్రత కల్పించలేదని మహారాష్ట్ర బీజేపీ ప్రశ్నించింది.
Kangana Ranaut News: బాలీవుడ్కి డ్రగ్స్ మాఫియాతో ఉన్న సంబంధాలపై ట్వీట్ చేసినా నటి కంగనా రనౌత్కి ఎందుకు భద్రత కల్పించలేదని మహారాష్ట్ర బీజేపీ ప్రశ్నించింది. బాలీవుడ్కి డ్రగ్స్ మాఫియాతో ఉన్న సంబంధాలను నిరూపిస్తానని కంగనా ట్వీట్ చేసి 100 గంటలు దాటినా ఆమెకు భద్రత కల్పించకపోవడం దురదృష్టకరమని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు బీజేపీ నేత రామ్ కదం లేఖ రాశారు. బాలీవుడ్ పరిశ్రమకు డ్రగ్స్తో ఉన్న సంబంధాలను అణిచివేయాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
సినీ ప్రముఖులు, రాజకీయ నేతలను ప్రజలు ఆదర్శంగా తీసుకుంటారని, డ్రగ్ మాఫియాకు ఉన్న సంబంధాలను పూర్తిగా అణిచివేయాలని ఆయన అన్నారు. కంగనా వెల్లడించే అంశాలు పెద్దల బాగోతం బయటకు తీస్తాయని ప్రభుత్వానికి భయం పట్టుకుందా..? అని ప్రశ్నించారు. ఈ మాఫియాతో రాజకీయ సంబంధాలు బయటపడుతాయా..? అని లేఖలో కదం సందేహం వ్యక్తం చేశారు. సుశాంత్ మృతి కేసులో నిందితురాలు రియాకు మహారాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించిందని, కంగనాకు అదే తరహాలో భద్రత ఏర్పాట్లు చేయలేదని ఆయన మండిపడ్డారు.
Read More:
షాకింగ్ న్యూస్.. ముగ్గురు ‘బిగ్బాస్’ కంటెస్టెంట్లకు పాజిటివ్!