AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్నాళ్లకా క్యాబినెట్ భేటీ: లక్ష్మణ్ ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీరు పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తైన ఆరునెలల తర్వాత నిన్ననే పూర్తి మంత్రివర్గ సమావేశం జరిగిందన్నారు. అయితే ఆరు గంటల క్యాబినెట్ మీటింగ్‌లో ప్రజాసమస్యల గురించి చర్చించలేదన్నారు. కేవలం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు, కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ కోసం మాత్రమే అసెంబ్లీ ఏర్పాటు చేశారని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలు, ఉద్యోగ ప్రకటన లాంటి అంశాలపై మాట కూడా మాట్లాడలేదన్నారు. రాజకీయ అవసరాల కోసం […]

ఇన్నాళ్లకా క్యాబినెట్ భేటీ: లక్ష్మణ్ ఫైర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 19, 2019 | 5:28 PM

Share

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీరు పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తైన ఆరునెలల తర్వాత నిన్ననే పూర్తి మంత్రివర్గ సమావేశం జరిగిందన్నారు. అయితే ఆరు గంటల క్యాబినెట్ మీటింగ్‌లో ప్రజాసమస్యల గురించి చర్చించలేదన్నారు. కేవలం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు, కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ కోసం మాత్రమే అసెంబ్లీ ఏర్పాటు చేశారని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలు, ఉద్యోగ ప్రకటన లాంటి అంశాలపై మాట కూడా మాట్లాడలేదన్నారు. రాజకీయ అవసరాల కోసం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. ఇక ఈ నెలాఖరు నుంచి బీజేపీలో చేరికలు ఉండబోతున్నాయన్నారు. పదవులు ఆశించి కాకుండా.. ప్రజలకు మంచిచేసే వారే పార్టీలో చేరాలని ఆయన చెప్పారు.