AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhainsa Violence: భైంసా బాధితులకు కిషన్‌రెడ్డి 3 నెలల జీతం..

Bhainsa Violence: భైంసా ఘటనలో అమాయకులు రోడ్డున పడ్డారని అన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. పోలీసులు అప్రమత్తంగా లేకపోవడంతోనే దాడులు జరిగాయన్నారు. భైంసాలో పర్యటించిన కేంద్ర మంత్రి బృందం.. బాధితులకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అందలేదన్నారు. కోర్బా, కిషాన్‌గల్లిలో పర్యటించిన కిషన్‌రెడ్డి.. స్థానికులతో మాట్లాడారు. ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. భైంసా దాడుల్లో 101 మంది నష్టపోయినట్టు గుర్తించామన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. కేంద్రం తరపున నివేదిక సేకరించామన్నారు. […]

Bhainsa Violence: భైంసా బాధితులకు కిషన్‌రెడ్డి 3 నెలల జీతం..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Feb 16, 2020 | 5:15 PM

Share

Bhainsa Violence: భైంసా ఘటనలో అమాయకులు రోడ్డున పడ్డారని అన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. పోలీసులు అప్రమత్తంగా లేకపోవడంతోనే దాడులు జరిగాయన్నారు. భైంసాలో పర్యటించిన కేంద్ర మంత్రి బృందం.. బాధితులకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అందలేదన్నారు. కోర్బా, కిషాన్‌గల్లిలో పర్యటించిన కిషన్‌రెడ్డి.. స్థానికులతో మాట్లాడారు. ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

భైంసా దాడుల్లో 101 మంది నష్టపోయినట్టు గుర్తించామన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. కేంద్రం తరపున నివేదిక సేకరించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నష్టపరిహారం ఇచ్చేలా చూస్తామన్నారు. తన మూడు నెలల జీతాన్ని బాధితులకు సాయంగా అందిస్తానన్న కిషన్‌రెడ్డి.. తమ ఎంపీల తరపున మరో 25 లక్షలను ఇస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కూడా ఆర్థిక సాయం అందేలా చూస్తామని హామి ఇచ్చారు.

గత నెలలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో.. భైంసాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్‌ విధించి.. శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా చూశారు. అల్లర్లకు కారణమైన వారిని గుర్తించి 17 మందిని అరెస్టుచేశామని పోలీసులు తెలిపినా.. రాజకీయంగా విమర్శలు ఆగలేదు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు భైంసాలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఆయన వెంట లక్ష్మణ్‌, ఎంపీలు అరవింద్‌, సంజయ్‌, సోయం ఉన్నారు.

Follow Us
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
స్టార్ హీరో కావాల్సిన యశో ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
స్టార్ హీరో కావాల్సిన యశో ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే
రక్త పింజర్లు ఆయా ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి జాగ్రత్త..
రక్త పింజర్లు ఆయా ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి జాగ్రత్త..
విద్యార్థుల పరీక్షలపై వైరల్ అవుతున్న  విరాట్ కోహ్లీ పోస్ట్
విద్యార్థుల పరీక్షలపై వైరల్ అవుతున్న  విరాట్ కోహ్లీ పోస్ట్
పొలంలో ఎరువుగా పేడను ఎందుకు వేస్తారు..?
పొలంలో ఎరువుగా పేడను ఎందుకు వేస్తారు..?