AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ.. కేంద్రంపై ఒవైసీ ఫైర్!

నిజామాబాద్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్) పూర్తయిన తర్వాత జాతీయ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) ను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ సభకు స్థానిక టిఆర్‌ఎస్ నాయకులు హాజరైయ్యారు. ధైర్యం ఉంటే జాతీయ జనాభా రిజిస్టర్ పూర్తయిన తర్వాత కేంద్రం ఎన్‌ఆర్‌సిని నిర్వహించదని బహిరంగ ప్రకటన చేయాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. ఆచరణాత్మకంగా, […]

నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ.. కేంద్రంపై ఒవైసీ ఫైర్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 28, 2019 | 5:26 AM

Share

నిజామాబాద్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్) పూర్తయిన తర్వాత జాతీయ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) ను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ సభకు స్థానిక టిఆర్‌ఎస్ నాయకులు హాజరైయ్యారు. ధైర్యం ఉంటే జాతీయ జనాభా రిజిస్టర్ పూర్తయిన తర్వాత కేంద్రం ఎన్‌ఆర్‌సిని నిర్వహించదని బహిరంగ ప్రకటన చేయాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు.

ఆచరణాత్మకంగా, కేంద్రం మొదట ఎన్‌పిఆర్ చేపట్టి, తరువాత ఎన్‌ఆర్‌సిని పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) కింద సర్వే నిర్వహించినప్పుడు వివరాలు ఇవ్వడంలో విఫలమైన వారిని దేశంలోని నిర్బంధ కేంద్రాలకు పంపిస్తారని ఎంఐఎం నాయకుడు హెచ్చరించారు. పత్రాలను సమర్పించడంలో విఫలమైన వ్యక్తులు బస చేయడానికి కేంద్రం ఇప్పటికే నిర్బంధ కేంద్రాలను నిర్మిస్తోంది. అస్సాంలో ఇప్పటికే ఒక పెద్ద నిర్బంధ కేంద్రం నిర్మాణంలో ఉందని ఒవైసీ తెలిపారు.

రాష్ట్రంలో ఎన్‌పిఆర్, ఎన్‌ఆర్‌సిల అమలుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సత్వర చర్యలు తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తంచేశారు. దేశంలో మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించడానికి ప్రధాని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్ర పన్నారని.. టిఆర్ఎస్ నాయకులు, ముస్లిం మత పెద్దలు ఆరోపించారు. దేశంలో లౌకికవాదాన్ని బలోపేతం చేయడానికి పోరాడుతున్న బిజెపి వ్యతిరేక శక్తులకు మద్దతు ఇవ్వాలని వారు ప్రజలను కోరారు.