AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా స్థాయికి తగ్గ ఆట కాదు.. నెక్ట్స్ మ్యాచ్ మే దెక్‌లెంగే: బాబర్ అజమ్

లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో పాకిస్థాన్ ఘోర ఓటమి చవిచూసింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ 200 పరుగులు దాటలేకపోయింది. కెప్టెన్ బాబర్ అజమ్ 8, 6 పరుగులతో విఫలమయ్యాడు. ఇంగ్లాండ్ 80/4 వద్ద ఉన్నప్పుడు వ్యూహం మార్చేవారా అని అడగగా, బాబర్ ‘లేదు’ అని సమాధానం ఇచ్చాడు.

మా స్థాయికి తగ్గ ఆట కాదు.. నెక్ట్స్ మ్యాచ్ మే దెక్‌లెంగే: బాబర్ అజమ్
Babar Azam
SN Pasha
|

Updated on: Aug 31, 2026 | 5:16 PM

Share

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాజయం చవిచూసింది. దీంతో సిరీస్‌లో వరుసగా రెండో ఓటమిని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమవడం ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన బాబర్.. తమ జట్టు అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోయిందని అంగీకరించాడు. మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ మేఘావృతమైన పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని భావించి బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకే పరిమితం చేయడంలో పాక్ బౌలర్లు కొంతవరకు సఫలమయ్యారు.

అయితే ఆ తర్వాత పాకిస్థాన్ బ్యాటర్లు మాత్రం పూర్తిగా నిరాశపరిచారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ 200 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. పాకిస్థాన్ తరఫున సౌద్ షకీల్ మాత్రమే పోరాటం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 97 పరుగులు చేసి జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించాడు. అయితే మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించలేదు. కెప్టెన్ బాబర్ అజమ్ కూడా ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే, తొలి రోజు ఇంగ్లాండ్ 80 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సమయంలో పాకిస్థాన్ మరింత ఒత్తిడి పెంచి ఉంటే మ్యాచ్ పరిస్థితి మారేదని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ విషయంపై బాబర్‌ను ప్రశ్నించగా ఆయన ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. ఆ సమయంలో తాను ఏమైనా వ్యూహాత్మక మార్పులు చేసేవాడినని అడగగా.. లేదు అని బాబర్ సూటిగా సమాధానం ఇచ్చాడు. తాము బౌలింగ్, బ్యాటింగ్‌లో ప్రణాళికలకు అనుగుణంగానే ఆడేందుకు ప్రయత్నించామని బాబర్ చెప్పాడు. అయితే కీలక భాగస్వామ్యాలను అడ్డుకోలేకపోయామని అంగీకరించాడు. పాకిస్థాన్ బౌలర్ అబ్బాస్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టినా, బ్యాటింగ్ వైఫల్యం కారణంగా జట్టుకు విజయం దక్కలేదు. ఇక ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న చివరి టెస్టులో మరింత బలంగా తిరిగి రావాలని బాబర్ పేర్కొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాడు. దీంతో చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్ ఎలాంటి మార్పులతో బరిలోకి దిగుతుందో ఆసక్తిగా మారింది.

Follow Us