తిరుపతి పద్మనగర్లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం
తిరుపతి పద్మనగర్లో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నం చేశాడు. వీధిలో ఆడుకుంటున్న బాలికను...
తిరుపతి పద్మనగర్లో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నం చేశాడు. వీధిలో ఆడుకుంటున్న బాలికను మునీర్ బాషా అనే ఆటోడ్రైవర్ గదిలోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేయబోయాడు. అరుపులు వినిపించడంగా నోట్లో గుడ్డలు కుక్కి రాక్షసత్వం ప్రదర్శించాడు. అయితే బాలిక కేకలు వినిపించడంతో స్థానికులు ఉన్నాదిని పట్టుకుని, చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. ముఖ్యంగా మహిళలు అతడిని చావబాదారు. అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా మున్నీర్ బాషా గతంలో కూడా ఇదే తరహాలో ప్రవర్తించినట్టు స్థానికులు చెబుతున్నారు.
Also Read :
రెండోసారి కరోనా సోకి కడప డాక్టర్ మృతి