జగనే సీఎం కావాలంటూ శ్రీవారికి తలనీలాలు..!
ప్రముఖ కమేడియన్ పృథ్వీ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన తిరుమల వెళ్లిన పృథ్వీ, శ్రీవారికి తన తలనీలాలను సమర్పించుకున్నారు. ఆయనకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు టీటీడీ ఆలయ అధికారులు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ.. జగన్ అన్ననే సీఎం కావాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. అమరావతిలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని, పార్టీకి 100 సీట్లు తథ్యమని పేర్కొన్నారు. గతంలో ఈయన జగన్ వెంట పాదయాత్రలో పాల్గొన్న విషయం తెలిసిందే.
ప్రముఖ కమేడియన్ పృథ్వీ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన తిరుమల వెళ్లిన పృథ్వీ, శ్రీవారికి తన తలనీలాలను సమర్పించుకున్నారు. ఆయనకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు టీటీడీ ఆలయ అధికారులు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ.. జగన్ అన్ననే సీఎం కావాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. అమరావతిలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని, పార్టీకి 100 సీట్లు తథ్యమని పేర్కొన్నారు. గతంలో ఈయన జగన్ వెంట పాదయాత్రలో పాల్గొన్న విషయం తెలిసిందే.