AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెలుగులోకి పంచనామా పూర్తి ప్రతి.. భారీగా రిజిస్టర్లు, డైరీలు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్ లో పంచానామాల పోరాటం తీవ్రమైంది. వారం రోజుల క్రితం జరిగిన ఐటి దాడులకు సంబంధించి అధికార, విపక్షాలు పోటాపోటీగా పంచానామాల కాపీలను మీడియాకు సర్క్యులేట్ చేసి రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. గత వారం తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన ఇండ్లు, కార్యాలయాలపై జరిగిన  దాడుల్లో 2 వేల కోట్ల రూపాయలకు పైగా అవినీతి, అక్రమార్జన వివరాలు బయటపడినట్లు తొలుత కథనాలు వచ్చాయి. ఐటి దాడులపై వచ్చిన కథనాల ఆధారంగా అధికార వైసీపీ విపక్ష టిడిపి నేతలపై […]

వెలుగులోకి పంచనామా పూర్తి ప్రతి.. భారీగా రిజిస్టర్లు, డైరీలు స్వాధీనం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 17, 2020 | 8:13 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో పంచానామాల పోరాటం తీవ్రమైంది. వారం రోజుల క్రితం జరిగిన ఐటి దాడులకు సంబంధించి అధికార, విపక్షాలు పోటాపోటీగా పంచానామాల కాపీలను మీడియాకు సర్క్యులేట్ చేసి రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. గత వారం తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన ఇండ్లు, కార్యాలయాలపై జరిగిన  దాడుల్లో 2 వేల కోట్ల రూపాయలకు పైగా అవినీతి, అక్రమార్జన వివరాలు బయటపడినట్లు తొలుత కథనాలు వచ్చాయి.

ఐటి దాడులపై వచ్చిన కథనాల ఆధారంగా అధికార వైసీపీ విపక్ష టిడిపి నేతలపై పెద్ద ఎత్తున విరుచుకుపడింది. చంద్రబాబు జమానా ఏ స్థాయిలో అవినీతికి పాల్పడింది అనడానికి అయన మాజీ పిఎస్ శ్రీనివాసరావు ఇంట్లో వెలుగు చుసిన అక్రమార్జన వివరాలు సాక్షాలతో వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

వైసీపీ నేతల ఆరోపణలను తిప్పేకొట్టేందుకు టీడీపీ నేతలు ఐటి దాడుల పంచానామాకు సంబంధించి కొన్ని ప్రతులని మీడియాకు విడుదల చేశారు. వాటిలోని వివరాల ఆధారంగా వైసీపీ నేతల ఆరోపణలు పూర్తిగా నిరాధారాలని చెప్పుకునేందుకు ప్రయత్నం చేశారు. వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా ఈ దాడుల్లో 2 వేల కోట్ల రూపాయల వివరాలు వెలుగు చూడలేదని, కేవలం రెండున్నర లక్షల రూపాయలను, 12 తులాల బంగారం గుర్తించి, వాటిపై వివరణ తీసుకుని వదిలేసారని టీడీపీ నేతలు యనమల, వర్ల రామయ్య తదితరులు చెప్పుకొచ్చారు. ఎలాంటి డైరీలను, లాకర్లను సీజ్ చేయలేదని.. ఒకవేళ చేసి ఉంటే పంచనామాలో ప్రస్తావించేవారని టీడీపీ నేతలు వాదించారు.

ఈ నేపథ్యంలో పంచనామా పూర్తి ప్రతులు మీడియాకు లీకయ్యాయి. వాటి ఆధారంగా చూస్తే ఐటి దాడుల్లో ఏమీ సీజ్ చేయలేదన్న టీడీపీ నేతల వాదనలో పస లేదని తేలిపోయింది. భారీగా రిజిస్టర్లు, డైరీలు స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ శాఖా అధికారులు పేర్కొన్నారు. వాటితో పాటు కొన్ని విలువైన డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేశారు. ఏబీ సుబ్బారెడ్డి లాకర్లు సీజ్ చేసినట్టు పంచనామాలో వెల్లడించారు. చంద్రబాబు మాజీ పిఎస్ కు పంచనామా కాపీ అందజేశారు.