‘జగనన్న విద్యాదీవెన’ పథకంపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం
అసలే కరోనా కష్టాలు..ఆపై అరకొర జీతాలు..కరోనా నుంచి బయటపడని జీవితాలు. ప్రస్తుతం ఎన్నో గడ్డు సమస్యలు సామాన్య మానవులను వెంటాడుతున్నాయి.

అసలే కరోనా కష్టాలు..ఆపై అరకొర జీతాలు..కరోనా నుంచి బయటపడని జీవితాలు. ప్రస్తుతం ఎన్నో గడ్డు సమస్యలు సామాన్య మానవులను వెంటాడుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లు కూడా గడవని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పిల్లల కాలేజీ ఫీజులు చెల్లించడం తల్లిదండ్రులకు తలకు మించిన భారమే. అయితే ఏపీలో సీఎం జగన్..జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పేద కుటుంబాలకు చేయూతగా నిలుస్తోన్న విషయం తెలిసిందే. కాగా విద్యా దీవెనకు అర్హులైన పేద విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి పెట్టొద్దు అంటూ కళాశాలలకు ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రవేశాల సమయంలో ఫీజుల కోసం ఒత్తిడి గురి చేయవద్దని సూచించింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నాలుగు విడతలుగా డబ్బు జమ చేస్తోన్నట్లు తెలిపింది. నిధులు విడుదల చేసిన వారంలోపు పేరెంట్స్ కళాశాలలకు ఫీజు చెల్లిస్తారని.. సరైన రీజన్ లేకుండా ఫీజు చెల్లించకపోయినా.. స్కీమ్ డబ్బును దుర్వినియోగం చేసినా తమ బాధ్యత కాదంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జగనన్న విద్యాదీవెన స్కీమ్ కింద విద్యార్థులకు గవర్నమెంట్ ఫీజులు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఫీజు రీయింబర్స్మెంట్ను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల అకౌంట్లలోకి ప్రభుత్వం జమ చేస్తుంది. తల్లుల ఖాతాల్లో నాలుగు త్రైమాసికాలకు డబ్బు వేస్తారు. తల్లిదండ్రులు మాత్రం కళాశాలలకు వెళ్లి ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇలా చెయ్యడం వల్ల తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లే వీలు ఉంటుందని, ఫీజులు నేరుగా చెల్లించడంవల్ల.. అక్కడ విద్యాబోధన, సౌకర్యాలు, ఇతర వసతుల గురించి తెలుసుకోవడం, పరిష్కారం కాని సమస్యలు ఉంటే అధికారులు దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read :