AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు పడవల ప్రయాణం చేస్తున్న దర్శకులు

రెండు పడవల ప్రయాణం చేస్తున్న దర్శకులు

Samatha J
|

Updated on: Feb 15, 2026 | 4:25 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకులు నటులుగా మారుతూ విజయాలు సాధిస్తున్నారు. లోకేష్ కనగరాజ్, తరుణ్ భాస్కర్ వంటి ప్రముఖులు దర్శకత్వంతో పాటు నటనలోనూ దూసుకుపోతున్నారు. శృతి హాసన్‌తో ఓ ప్రైవేట్ సాంగ్ చేసి, ఇప్పుడు హీరోగా లోకేష్ నటిస్తున్నారు. తరుణ్ భాస్కర్ కూడా నటుడిగా బిజీ అవుతూనే, దర్శకుడిగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ ధోరణి సినీ రంగంలో కొత్త మార్పుకు దారి తీస్తోంది.

చిత్ర పరిశ్రమలో దర్శకులుగా కెరీర్ ప్రారంభించిన అనేక మంది ఇప్పుడు నటులుగా కూడా తమదైన ముద్ర వేసుకుంటున్నారు. కెమెరా వెనుక వందల మందిని సమర్థవంతంగా నడిపించే వీరు, కెమెరా ముందు నటనలోనూ తమ సత్తా చాటుతున్నారు. దీన్ని రెండు పడవల ప్రయాణంగా అభివర్ణిస్తున్నారు.ఈ కోవలో ముందుగా చెప్పుకోవాల్సింది లోకేష్ కనగరాజ్ గురించి. దర్శకుడిగా ఇప్పటికే తనదైన శైలిని ప్రదర్శించిన లోకేష్, ఇప్పుడు నటుడిగా బిజీ కావాలని చూస్తున్నారు. శృతి హాసన్‌తో కలిసి ఓ ప్రైవేట్ పాటలో నటించిన లోకేష్, ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న డీసీ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైంది.మరోవైపు, తరుణ్ భాస్కర్ కూడా దర్శకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. ఇటీవల ఓం శాంతి శాంతి శాంతి సినిమాలో నటించిన తరుణ్, త్వరలో ఈ నగరానికి ఏమైంది 2తో దర్శకుడిగా తిరిగి వస్తున్నారు. ఈ లోపే గాయపడ్డ సింహం అనే చిత్రంలో హీరోగానూ నటిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!