AP Government Orders: ఏపీ: విశ్రాంత ఐఏఎస్ ప్రేమ్‌ చంద్రారెడ్డి సర్వీసు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ

AP Government Orders: విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎల్‌. ప్రేమ్‌ చంద్రారెడ్డి సర్వీసును మరో రెండేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు..

AP Government Orders: ఏపీ: విశ్రాంత ఐఏఎస్ ప్రేమ్‌ చంద్రారెడ్డి సర్వీసు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ
Follow us

|

Updated on: Dec 30, 2020 | 7:27 PM

AP Government Orders: విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎల్‌. ప్రేమ్‌ చంద్రారెడ్డి సర్వీసును మరో రెండేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2023 మార్చి 31 వరకూ సాధారణ పరిపాలన శాఖలో ఎక్స్‌ అఫీషియో ముఖ్య కార్యదర్శిగా సర్వీసును పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కాగా, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎల్‌. ప్రేమ్‌ చంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజనలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన అంశాలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఆయన సర్వీసును మూడు సార్లు పొడిగించింది ఏపీ ప్రభుత్వం. తాజాగా మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.