AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేటి ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఏపీ కేబినెట్ భేటీ

బుధవారం ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం సమావేశ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం కేబినెట్ తెలపనుంది . కీల‌క అంశాలు ఎజెండాల‌తో గురువారం నుంచి అమల్లోకి రానున్న నూతన ఇసుక విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అదే విధంగా ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశానికి సంబంధించి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి కమిటీ నివేదికపై చర్చ జరగునుంది. అదే విధంగా విలీనంలో భాగంగా సంస్ధ ఉద్యోగులను రాష్ట్ర […]

నేటి ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఏపీ కేబినెట్ భేటీ
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 04, 2019 | 12:56 AM

Share

బుధవారం ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం సమావేశ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం కేబినెట్ తెలపనుంది . కీల‌క అంశాలు ఎజెండాల‌తో గురువారం నుంచి అమల్లోకి రానున్న నూతన ఇసుక విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అదే విధంగా ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశానికి సంబంధించి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి కమిటీ నివేదికపై చర్చ జరగునుంది. అదే విధంగా విలీనంలో భాగంగా సంస్ధ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చుకునే అంశంపై మంత్రివర్గ భేటీలో క్లారిటీ రానుంది. య‌స్సీ, య‌స్టీ ల‌కు ప్ర‌త్యేక క‌మీష‌న్ల ఏర్పాటు, టిటిడి పాల‌క మండ‌లి స‌భ్యుల సంఖ్య ను 19 నుండి 25 కు పెంచే అంశాలపై ఆర్డీనెన్స్ కు వంటి అంశాలకు మంత్రివర్గం అమోదం తెలపనుంది .

ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానం, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను సమీక్షించాలని భావించిన ప్రభుత్వం పీపీఏ రద్దు చేయాలని కూడా నిర్ణయించింది. అయితే ట్రిబ్యునల్ రెండు రోజుల క్రితం రద్దు చెయవద్దని ఆదేశించింది. ఈ అంశం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కూడా గురువారం చర్చ జరగనుంది. అదే విధంగా అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాల ఏర్పాటు కానున్న నేపథ్యంలో వీటిపైనా చర్చించనున్నారు. అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్న వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి మంత్రులు చర్చించనున్నారు. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన 15వ పీఆర్సీపై చర్చ జరగనుంది. వీటన్నిటితో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన నవరత్నాల అమలు కోసం కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది.

ఇదిలా ఉంటే సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో నూతన ఇసుక విధానంపై సీఎం జగన్ గురువారం స్పష్టత ఇవ్వనున్నారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో ఇసుక విధానంపై మంత్రి పెద్దిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే 100 రీచ్‌లను గుర్తించామని, 5వ తేదీ నుంచి స్టాక్ యార్డుల ద్వారా ఇసుకను సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు.

Follow Us