AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి : ఏపీ బీజేపీ చీఫ్ కన్నా డిమాండ్

ఏపీలో పాలనా వికేంద్రీకరణపై బీజేపీ గత కొంతకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. రాయలసీమ ప్రాంతాన్ని పాలనా పరంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగానే కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం రాయలసీమ కరువు పరిస్థితిపై స్పందించడం లేదని విమర్శించారు. రాయలసీమ జిల్లాల్లో ఒక్కటైన కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ప్రకాశం జిల్లాను వెనుకబడిన […]

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి :  ఏపీ బీజేపీ చీఫ్  కన్నా  డిమాండ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 14, 2019 | 8:05 PM

Share

ఏపీలో పాలనా వికేంద్రీకరణపై బీజేపీ గత కొంతకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. రాయలసీమ ప్రాంతాన్ని పాలనా పరంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగానే కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం రాయలసీమ కరువు పరిస్థితిపై స్పందించడం లేదని విమర్శించారు. రాయలసీమ జిల్లాల్లో ఒక్కటైన కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని కన్నా కోరారు. గత ప్రభుత్వం మాదిగా కాకుండా వైసీపీ ప్రభుత్వమైనా కేంద్రానికి సహకరించాలన్నారు. ఇలా సహకరిస్తే కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మార్గం సుగమవుతుందని కన్నా పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, రాజధాని అమరావతిని తరలిస్తే ఊరుకోమంటూ బీజేపీ అధ్యక్షుడు ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు అదే పార్టీకి చెందిన కర్నూలుకు చెందిన ఎంపీ టీజీ వెంకటేశ్.. మాత్రం కొంచెం స్వరాన్ని పెంచి ఏపీకి రెండు రాజధానులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీకి చెందిన నేతలు వేరువేరుగా ప్రకటనలు.. డిమాండ్‌లు చేస్తుండటంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. గతంలో ఐదేళ్లపాటు పాలించిన టీడీపీని కర్నూలులో కోర్టు ఏర్పాటు చేయాలని ఎందుకు నిలదీయలేదని, రెండు రాజధానులు కావాలని గతంలో ఎందుకు డిమాండ్ చేయలేదంటూ ప్రశ్నిస్తున్నారు.