AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ’ వేడుకలు: వారికే సన్మానాలు..!!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయిలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకలకు తొలి రోజు ముఖ్య అతిథులుగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు. అలాగే పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా అమరజీవిపొట్టి శ్రీరాములుకు నివాళి అర్పించనున్నారు. రాష్ట్ర విభజన […]

'ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ' వేడుకలు: వారికే సన్మానాలు..!!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 01, 2019 | 8:14 AM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయిలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకలకు తొలి రోజు ముఖ్య అతిథులుగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు. అలాగే పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా అమరజీవిపొట్టి శ్రీరాములుకు నివాళి అర్పించనున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం ఐదేళ్ల తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ఒరిజినల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ కొనసాగించాలంటే నవంబర్‌ 1నే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. దీనితో పాటు స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేసిన మహనీయుల వారసులను ఘనంగా సన్మానించనున్నారు.

రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతు, వావిలాల గోపాలకృష్ణయ్య, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, దామోదరం సంజీవయ్యల వారసులు, బంధువులను ఈ సందర్భంగా ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. వేదికకు ఇరువైపులా చేనేత, హస్తకళలకు సంబంధించిన 21 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. సంగీతం, నృత్యం, నాటకం వంటి లలితకళల ప్రదర్శనలతో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

Follow Us
ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసి యూత్‌ను ఫిదా చేసిన బ్యూటీ
ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసి యూత్‌ను ఫిదా చేసిన బ్యూటీ
సినిమా టికెట్ రేట్ల పెంపు పై ట్విస్ట్.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవే
సినిమా టికెట్ రేట్ల పెంపు పై ట్విస్ట్.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవే
ఇస్రో సైంటిస్ట్ కుమారుడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో
ఇస్రో సైంటిస్ట్ కుమారుడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో
సరైన సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవడం ఎలాగో తెలుసా?
సరైన సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవడం ఎలాగో తెలుసా?
ఇండియా గెలిచింది.. యాడ్ల మార్కెట్ ఊగిపోయింది
ఇండియా గెలిచింది.. యాడ్ల మార్కెట్ ఊగిపోయింది
స్క్రీన్ టైమ్.. నిద్రలేమి.. మెదడును పిండేస్తున్న పని ఒత్తిడి!
స్క్రీన్ టైమ్.. నిద్రలేమి.. మెదడును పిండేస్తున్న పని ఒత్తిడి!
గ్యాస్ అయిపోయిందా? డెలివరీ రాదని టెన్షన్ పడుతున్నారా?
గ్యాస్ అయిపోయిందా? డెలివరీ రాదని టెన్షన్ పడుతున్నారా?
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే!
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే!
పాఠాలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిని చూసి విద్యార్ధులు షాక్..
పాఠాలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిని చూసి విద్యార్ధులు షాక్..