AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 316 పాజిటివ్ కేసులు, కొత్తగా ఎంతమంది మరణించారంటే?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 43,006 శాంపిళ్లను టెస్ట్ చేయగా...316 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

AP Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 316 పాజిటివ్ కేసులు, కొత్తగా ఎంతమంది మరణించారంటే?
Ram Naramaneni
|

Updated on: Dec 07, 2020 | 6:07 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 43,006 శాంపిళ్లను టెస్ట్ చేయగా…316 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 872288కు చేరింది. వైరస్ కారణంగా కొత్తగా ఐదుగురు ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7,038కి చేరింది.  గడిచిన 24 గంటల్లో 595 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 859624 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో  5626 యాక్టీవ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 1,04,53,618 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. కొత్తగా నమోదైన మరణాల పరిశీలిస్తే.. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, కడప, విశాఖ జిల్లాల్లో ఒకరు చొప్పున మృతిచెందారు.