Anasuya Bharadwaj: కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయంటున్న జబర్ధస్త్ యాంకర్… ట్విట్టర్లో పోస్ట్…
టాలీవుడ్లో కరోనా బారినపడుతున్న సెలబ్రిటీల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే రామ్ చరణ్, వరుణ్ తేజ్, తమన్నా, రకుల్ కోవిడ్...
టాలీవుడ్లో కరోనా బారినపడుతున్న సెలబ్రిటీల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే రామ్ చరణ్, వరుణ్ తేజ్, తమన్నా, రకుల్ కోవిడ్ బారినపడ్డారు. తాజాగా జబర్ధస్త్ యాంకర్ అనసూయకు కూడా కరోనా సోకినట్టు ఉంది. కాగా ఈ విషయాన్ని అనసూయే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. తనలో కోవిడ్ లక్షణాలు ఉన్నాయని ఆ ట్వీట్ లో రాసుకొచ్చింది.
ఇంకా ఏం రాసిందంటే…‘‘ఈ రోజు ఉదయం ఓ కార్యక్రమం కోసం కర్నూలు వెళదామని ఉదయాన్నే లేచాను. నాలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో నా ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాను. వీలైనంత త్వరగా టెస్ట్ చేయించుకుంటాను. ఇటీవలి కాలంలో నన్ను కలిసిన వాళ్లు కూడా ఓ సారి టెస్ట్ చేయించుకోండి. నా రిపోర్ట్ ఏంటనేది మీకు తెలియజేస్తాను. అందరు జాగ్రత్త’’ అని అనసూయ తన ట్వీట్లో పేర్కొంది. కాగా కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ అనే చిత్రం కూడా అనసూచ నటిస్తోంది. మరోవైపు నిహారికతో కలిసి వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. వీటితో పాటు పలు షోలకు యాంకర్గా పనిచేస్తోంది.
అనసూయ పెట్టిన ట్వీట్ ఇదే…
??? pic.twitter.com/uNRhkclwi0
— Anasuya Bharadwaj (@anusuyakhasba) January 10, 2021