కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్

ఢిల్లీ : పుల్వామా ఘటనకు ప్రతికారంగా కేంద్ర ప్రభుత్వం పాక్ పై  కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో భవిష్యత్తులో ఇలాంటి కవ్వంపు చర్యలకు దిగకుండా పాకిస్తాన్ కు గట్టిగా బుద్ది చెప్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది. దీనిపై ఇతర పార్టీనేతల సలహాలు, సూచనలను కేంద్రం స్వీకరించనుంది. ఈ సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబ, కాంగ్రెస్‌ నేత […]

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:13 PM

ఢిల్లీ : పుల్వామా ఘటనకు ప్రతికారంగా కేంద్ర ప్రభుత్వం పాక్ పై  కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో భవిష్యత్తులో ఇలాంటి కవ్వంపు చర్యలకు దిగకుండా పాకిస్తాన్ కు గట్టిగా బుద్ది చెప్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది. దీనిపై ఇతర పార్టీనేతల సలహాలు, సూచనలను కేంద్రం స్వీకరించనుంది. ఈ సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబ, కాంగ్రెస్‌ నేత వేణుగోపాల్‌, ఎన్‌సీ నేత ఫరూక్‌ అబ్దుల్లా, సీపీఎం, సీపీఐ నేతలు, బీఎస్పీ నేత సతీశ్‌చంద్ర మిశ్రా, టీడీపీ, టీఆర్‌ఎస్‌ నేతలు రామ్మోహన్‌ నాయుడు, జితేందర్‌రెడ్డి, , ఎల్‌జెపీ నేత రాంవిలాస్‌ పాసవాన్‌లు హాజరయ్యారు.