Indian Railways: 3 గంటల ప్రయాణం కేవలం 55 నిమిషాల్లోనే.. ఈ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!
Indian Railways: ఈ రైలులు ప్రయాణించేందుకు ప్రయాణికులు స్టేషన్లలోని వెండింగ్ మెషీన్ల ద్వారా (UPI ఉపయోగించి), స్మార్ట్ కార్డ్ ద్వారా లేదా 'RRTS Connect' మొబైల్ యాప్ ద్వారా QR కోడ్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఢిల్లీ-ఎన్సిఆర్ (NCR) ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా, కాలుష్యం కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Namo Bharat Trains: కేంద్ర ప్రభుత్వ ప్రయాణికుల కోసం సరికొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే హైస్పీడ్ రైళ్లను సైతం ప్రవేశపెడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ రైలు ఢిల్లీ -మీరట్ మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యాంశాలు.
మార్గం, స్టేషన్లు: ఈ మార్గం మొత్తం 82 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్లో ప్రధానంగా ఉండే స్టేషన్లు ఉన్నాయి. అవి
ఢిల్లీలో: సరాయ్ కాలే ఖాన్, న్యూ అశోక్ నగర్, ఆనంద్ విహార్.
ఉత్తర ప్రదేశ్లో: సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్ధర్, దుహై, మురాద్ నగర్, మోదీ నగర్ (సౌత్అండ్ నార్త్), మీరట్ సౌత్, మీరట్ లోని ఇతర స్టేషన్లు.
ఇక ఈ రైలు వేగం విషయానికొస్తే..గరిష్ట వేగం ఈ రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా తయారు చేశారు. అయితే ప్రస్తుతం గంటకు 160 కి.మీ వేగంతో నడుస్తాయి. ఢిల్లీ నుంచి మీరట్ మధ్య దూరాన్ని కేవలం 55 నుండి 60 నిమిషాల్లో చేరుకోవచ్చు. గతంలో ఈ ప్రయాణానికి దాదాపు 3 గంటల సమయం పట్టేది.
రైలు ప్రత్యేకతలు:
నమో భారత్ రైలులో స్టాండర్డ్, ప్రీమియం అనే రెండు రకాల కోచ్లు ఉంటాయి. ఒక కోచ్ పూర్తిగా మహిళల కోసం కేటాయించారు. ప్రతి సీటు వద్ద మొబైల్/ల్యాప్టాప్ ఛార్జింగ్ పాయింట్లు, ఉచిత వై-ఫై (Wi-Fi) సౌకర్యం ఉంటుంది. లగేజీ ఉంచడానికి ప్రత్యేక ర్యాక్లు, సిసిటివి కెమెరాలు, అత్యవసర పరిస్థితుల్లో డ్రైవర్తో మాట్లాడేందుకు ఇంటర్కామ్ సౌకర్యం ఉన్నాయి.
టికెట్ ధరలు:
టికెట్ ధరలు ప్రయాణించే దూరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. స్టాండర్డ్ కోచ్ కనీస ధర రూ. 20 నుండి గరిష్టంగా రూ. 150 – 160 వరకు ఉండవచ్చు. అదే ప్రీమియం కోచ్: దీని ధర స్టాండర్డ్ కోచ్ కంటే దాదాపు రెట్టింపు ఉంటుంది (సుమారు రూ. 250 – 300 వరకు).
బుకింగ్, సమయాలు
సమయాలు: ప్రతిరోజూ ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది.
టికెట్ బుకింగ్: స్టేషన్లలోని వెండింగ్ మెషీన్ల ద్వారా (UPI ఉపయోగించి), స్మార్ట్ కార్డ్ ద్వారా లేదా ‘RRTS Connect’ మొబైల్ యాప్ ద్వారా QR కోడ్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఢిల్లీ-ఎన్సిఆర్ (NCR) ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా, కాలుష్యం కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




