AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఫొని’ తుఫాన్ బాధితులకు అక్షయ్ రూ.కోటి విరాళం

ఉగ్రరూపం దాల్చిన ‘ఫొని’ తుఫాన్… ఒడిశాలో బీభత్సం చేసిన సంగతి విదితమే. తుఫాన్‌ తీరం దాటిన సమయంలో గంటకు 200 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. ఒడిశాలో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఫొని తుఫాన్ కారణంగా ఆ రాష్ట్రంలో 34 మంది మరణించారు. వేలాది విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు నేలకూలడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోయింది. తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న ఒడిశాను ఆదుకోవడానికి పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ […]

'ఫొని' తుఫాన్ బాధితులకు అక్షయ్ రూ.కోటి విరాళం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 07, 2019 | 2:47 PM

Share

ఉగ్రరూపం దాల్చిన ‘ఫొని’ తుఫాన్… ఒడిశాలో బీభత్సం చేసిన సంగతి విదితమే. తుఫాన్‌ తీరం దాటిన సమయంలో గంటకు 200 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. ఒడిశాలో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఫొని తుఫాన్ కారణంగా ఆ రాష్ట్రంలో 34 మంది మరణించారు. వేలాది విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు నేలకూలడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోయింది. తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న ఒడిశాను ఆదుకోవడానికి పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ భూరి విరాళం ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు.

ఫొని తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఒడిశాకు అక్షయ్‌ కుమార్‌.. కోటి రూపాయాల విరాళాన్ని అందించారు. ఒడిశా సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఈ మొత్తాన్ని పంపించారు. గతంలో కేరళ, చెన్నైలో తుఫాన్ బీభత్సం చేసినప్పుడు కూడా అక్షయ్‌ తన వంతు సాయం చేశారు. అంతేకాదు ‘భారత్ కే వీర్‌’ వెబ్‌సైట్‌ ద్వారా ఆయన జవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.