గురుకుల పాఠశాలల్లో.. లాటరీ పద్ధతిలో అడ్మిషన్లు..

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు లాక్ డౌన్ సడలింపులతో జనజీవనం తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలో

గురుకుల పాఠశాలల్లో.. లాటరీ పద్ధతిలో అడ్మిషన్లు..

Updated on: Jun 18, 2020 | 2:09 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు లాక్ డౌన్ సడలింపులతో జనజీవనం తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ(ఏపీఆర్‌ఇఐఎస్‌) కింద నిర్వహిస్తోన్న 50 గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల విధానం మారింది. గతేడాది వరకు అమల్లో ఉన్న స్ర్కీనింగ్‌ టెస్ట్‌ను అధికారులు ఉపసంహరించారు.

కాగా.. 2020-21 విద్యా సంవత్సరపు 5వ తరగతి అడ్మిషన్లకు లాటరీ పద్ధతిని అమలు చేయనున్నారు. అలాగే 6-7 తరగతుల బ్యాక్‌లాగ్‌ అడ్మిషన్లకు లాటరీ పద్ధతినే అమలు చేస్తారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టర్లు ఆయా తరగతుల అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టేందుకు జిల్లాస్థాయిలో ఎంపిక కమిటీ(డీఎస్సీ)లను ఏర్పాటు చేస్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us