మెర్లపాక గాంధీ డైరెక్షన్లో నితిన్ కొత్త సినిమా… దుబాయ్లో ప్రారంభమైన షూటింగ్
యంగ్ హీరో నితిన్ వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఈ ఏడాది భీష్మ సినిమాతో మంచి విజయం అందుకున్న నితిన్ అదే జోష్ లో రంగ్ డే సినిమా చేస్తున్నాడు.
యంగ్ హీరో నితిన్ వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఈ ఏడాది భీష్మ సినిమాతో మంచి విజయం అందుకున్న నితిన్ అదే జోష్ లో రంగ్ డే సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది.
ఈ సినిమాతో పాటు మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్. బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధాధున్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. నితిన్ కెరియర్ లో 30వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో ఇస్మార్ట్ బ్యూటీ నభానటేశ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ తాజాగా దుబాయ్ లో ప్రారంభమైంది. నితిన్, నభా నటేష్పై దుబాయ్లో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై వస్తోన్న ప్రొడక్షన్ నంబర్ 6ను ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో తమన్నా కీలక పాత్ర లో కనిపించనుంది. జనవరి నుంచి జరిగే తదుపరి షెడ్యూల్ షూటింగ్లో తమన్నా పాల్గొననుందని సమాచారం.
#Nithiin30 shoot starts!! @GandhiMerlapaka @tamannaahspeaks @NabhaNatesh #sagarmahati pic.twitter.com/HDRjnFpKQa
— nithiin (@actor_nithiin) December 6, 2020