AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG 3rd T20I: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బంతుల్లో సెంచరీ..!

భారత క్రికెట్ జట్టు (Team India) ఓపెనర్లు టీ20 సమరంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) కేవలం 30 బంతుల్లోనే 100 పరుగులు బాదేశాడు. 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో ఆప్ఘాన్ బౌలర్ల తాట తీశాడు.

IND vs AFG 3rd T20I: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బంతుల్లో సెంచరీ..!
Abhishek Sharma Century
Venkata Chari
|

Updated on: Sep 17, 2026 | 8:14 PM

Share

టీ20లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 30 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. 2017లో 35 బంతుల్లో సెంచరీ చేసి రోహిత్ శర్మ నెలకొల్పిన రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు.

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడవ టీ20లో, భారత్ 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 134 పరుగులు చేసింది.

అభిషేక్ 31 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 101 పరుగులు చేసి బ్యాటింగ్ చేస్తున్నాడు. సంజు సామ్సన్ 23 బంతుల్లో 33 పరుగులు చేశాడు. భారత్ ఇంతకుముందు పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 100 పరుగులు చేసింది, అదే వారి అత్యధిక పవర్‌ప్లే స్కోరు.

Follow Us